లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వైన్స్, బార్ లు మూతపడ్డాయి. మందు దొరక్క మందుబాబులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. మందు దొరక్క కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొంత మంది ఏకంగా ఆత్మహతలకే పాల్పడుతున్నారు. ఇలాంటి వారితో ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నిండిపోతోంది. రోజు రోజుకు ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతూవస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్టంలోని వైన్ షాపులు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవడం జరగదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. ఈ విషయంలో ప్రభుత్వానికి మరో ఆలోచనే లేదని ఖరాఖండిగా చెప్పేసారు. ఎవరు డిమాండ్ చేసినా సరే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని కుండబద్దలు కొట్టారు. కరోనా వ్యాపిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఈ ప్రకటన మందుబాబులకు మింగుడు పడటంలేదు. లాక్ డౌన్ పొడిగించిన వైన్స్, బార్ లకు షరతులతో కూడిన మినహాయింపు ఇస్తారని మందుబాబులంతా భావించారు. సీఎం వ్యాఖ్యలతో వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…