Featured

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు వెయిటేజీ మార్కులను తొలగిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు కరోనా, లాక్ డౌన్ కారణంగా సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయినట్టు ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది. అనంతరం పాస్ మార్కులతో సంబంధం లేకుండా ఫలితాలను వెల్లడించింది.

అయితే ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా వెయిటేజీ మార్కులను తొలగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం జేఎన్టీయూను రెండో విడత కౌన్సిలింగ్ ఆపేయాలని ఆదేశాలు జారీ చేయగా తెలంగాణ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ నిబంధనలను సవరించింది.

మారిన నిబంధనల వల్ల ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. గత కొన్ని రోజుల నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్ వెయిటేజీ తొలగిస్తారంటూ వార్తలు వెలువడగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి.

ప్రభుత్వం తాజా నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో టెన్షన్ పడుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ఊరట కలిగిందనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

1 hour ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

2 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

2 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

2 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

2 hours ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago