YS Jagan Mohan Reddy: ఈ జగన్ కి ఇవ్వడమే తెలుసు.. చంద్రబాబుపై ఫైర్ అయిన జగన్!

YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జగన్ బొబ్బలి పాకాయిరావుపేట ఏలూరులో పర్యటించారు. అయితే ఈ సభలలో భాగంగా చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుందని అందుకే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం మన ఏపీలో అమలులో లేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అమలులో ఉందని పేదల భూములను జగన్ లాక్కుంటున్నారని ప్రచారాలు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి పేదలకు పంచడమే తప్ప చంద్రబాబు లాగా లాక్కోవడం తెలియదని ఈయన విమర్శలు చేశారు. వంద సంవత్సరాల తర్వాత తిరిగి భూములకు రీ సర్వే జరుగుతుంది. భూములను అప్డేట్ చేసే రైతన్నలకు అందిస్తూ ఉంటే చంద్రబాబునాయుడు ఓర్చుకోలేకపోయారని జగన్ మండిపడ్డారు.

బాబును ఓడించడం అంటే పేదలను గెలిపించడమే..

రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ఈ సర్వేలన్నింటినీ చేయించామని వారు ఇకపై కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని తప్పించామని జగన్ తెలిపారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పేదలు, పేదలు అంటూ ఉంటే పెత్తందారి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి నచ్చడం లేదని విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడును ఓడించడం అంటే పేదలను గెలిపించినట్టే అంటూ ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago