Featured

భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. కానీ ప్రజలకు లాభమే..?

కరోనా సంక్షోభ సమయంలో ఆదాయం తగ్గడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలన్నీ లాక్ డౌన్ సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో పాటు 20 శాతం నుంచి 30 శాతం వరకు వేతనాల్లో కోత విధించాయి. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా గ్యాస్ కంపెనీలు మాత్రం రాయితీ సిలిండర్ ధరలను అంతకంతకూ పెంచుతున్నాయి.

ఈ నెల 2వ తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. 15 రోజులు కూడా గడవక ముందే గ్యాస్ కంపెనీలు మళ్లీ ధరలను పెంచడం గమనార్హం. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 700 రూపాయలకు అటూఇటుగా గ్యాస్ సిలిండర్ లభిస్తుండగా సిలిండర్ ధర 750 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

గ్యాస్ కంపెనీలు కేవలం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై మాత్రమే ధరలను పెంచాయి. అందువల్ల ఆ మొత్తం సబ్సిడీ ఖాతాదారుల అకౌంట్లలో జమవుతుంది. అందువల్ల ధరలు పెరిగినా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు లాభమే కానీ నష్టం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ఇస్తోంది. ఫలితంగా ధరలు ఎంత పెరిగినా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఎటువంటి నష్టం లేదు.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి వారంలో గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షించి ధరలలో మార్పులు చేస్తూ ఉంటాయి. అయితే ఈ నెలలో మాత్రం రెండు సార్లు ధరలలో మార్పులు చేయడంతో పాటు ఏకంగా 100 రూపాయలు పెంచాయి. అయితే కేంద్రం 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉండటం వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

4 hours ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

4 hours ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

4 hours ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

5 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

5 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

5 hours ago