Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి నిన్నటి వరకు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపించింది దీంతో కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు దీనిని అధికారకంగా కూడా ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు తాపత్రయపడిన రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడంతో డిప్యూటీ సీఎం అన్న అవుదామని ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవికి అత్యధికంగా డిమాండ్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవి రేసులో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నారు.
తనకు కీలకమైన పోర్ట్ ఫోలియోతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా పలువురు డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది.సీతక్కకు మంత్రి పదవి ఖాయమైనప్పటికీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను అధికంగా గెలుచుకున్నందుకు తమ వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆదివాసి ఎమ్మెల్యేలు అధిక ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
సీతక్క పట్ల సానుకూలం..
ఇక సీతక్కకు మంత్రి పదవి ఇప్పటికే కారారు అయినప్పటికీ ఆమెకు డిప్యూటీ పదవి కూడా కట్ట పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సీతక్క పట్ల సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ముఖ్యమంత్రి పదవికి కాకుండా డిప్యూటీ సీఎం పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు మరి ఈ పదవి ఎవరిని వరిస్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్న విషయాలు త్వరలోనే తెలియని ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…