Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి నిన్నటి వరకు పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి అయితే ఎక్కువగా రేవంత్ రెడ్డి పేరే వినిపించింది దీంతో కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం గురించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు దీనిని అధికారకంగా కూడా ప్రకటించారు.
ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు తాపత్రయపడిన రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడంతో డిప్యూటీ సీఎం అన్న అవుదామని ఎంతోమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవికి అత్యధికంగా డిమాండ్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ డిప్యూటీ సీఎం పదవి రేసులో సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్కతో పాటు బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ డిప్యూటీ సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్నారు.
తనకు కీలకమైన పోర్ట్ ఫోలియోతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో కూడా పలువురు డిప్యూటీ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది.సీతక్కకు మంత్రి పదవి ఖాయమైనప్పటికీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను అధికంగా గెలుచుకున్నందుకు తమ వర్గానికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆదివాసి ఎమ్మెల్యేలు అధిక ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
సీతక్క పట్ల సానుకూలం..
ఇక సీతక్కకు మంత్రి పదవి ఇప్పటికే కారారు అయినప్పటికీ ఆమెకు డిప్యూటీ పదవి కూడా కట్ట పెట్టాలన్న ఆలోచనలు ఉన్నారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా సీతక్క పట్ల సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలా ముఖ్యమంత్రి పదవికి కాకుండా డిప్యూటీ సీఎం పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు మరి ఈ పదవి ఎవరిని వరిస్తుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎవరు చోటు దక్కించుకుంటారు అన్న విషయాలు త్వరలోనే తెలియని ఉన్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…