Renudesai: రేను దేశాయ్, అకీరా లకు కరోనా.. రెండు డోసులు తీసుకున్నా వచ్చింది రేణు దేశాయ్

Renudesai: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు రోజుకు కేవలం 10 వేలలోపే ఉన్న కేసులు ప్రస్తుతం లక్షను దాటాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్లను కూడా విధిస్తున్నాయి.  ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాన్ మాజీ భార్య సినీ స్టార్ రేణు దేశాయ్, కొడుకు అఖిరానందన్ కు కరోనా వచ్చింది.

Renudesai: రెండు డోసులు తీసుకున్నా కరోనా వచ్చింది..రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ విషయాన్ని రేణూ దేశాయ్ ఇన్ స్టా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే తాను రెండు డోసులు తీసుకున్నా.. అని, త్వరలోనే అఖిరాకు కూడా వ్యాక్సిన్ అందిచాలని అనుకుంటున్న సమయంలో ఇద్దరికి కరోనా సోకిందని వెల్లడించింది. .


RenuDesai : వరసగా ఫిలిమ్ స్టార్లు కరోనా…

తమకు లక్షణాలు తగ్గిపోయాయని.. ప్రజలు కూడా థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకోవాలని.. మాస్కులు తప్పకుండా పాటించాలని రేణూ దేశాయ్ సూచించింది. ఇదిలా ఉంటే ఇటీవల వరసగా ఫిలిమ్ స్టార్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లోని ప్రముఖులు కరోనా బారిన పడ్దారు. మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, విక్రమ్, సత్యారాజ్, డైరెక్టర్ ప్రియదర్శన్, సంగీత దర్శకుడు థమన్, త్రిష, సింగర్ లతా మంగేష్కర్ వంటి వారికి కరోనా సోకింది. మరోవైపు రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కరోనా సోకగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి కరోనా సోకింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.