Anupama Parameswaran: అనుమప పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భామ తాజాగా ట్రోలింగ్ కు గురవుతుంది. ఓ డెబ్యూ హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించడంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
అయితే లిప్ లాక్ సీన్లంటే చాలామంది వెనకడుగు వేస్తారు. అయితే అది కూడా స్టార్ హీరోతో అయితేనే కొంతమంది ఒప్పుకుంటారు. సాధారణంగా యంగ్ హీరోలు కానీ డెబ్యూ హీరోలతో లిప్లాక్ సీన్ చేసేందుకు హీరోయిన్స్ ఒప్పుకోరు.
ఇలా అనుమప నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారిడితో లిప్ లాక్ చేయడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఆశిష్ రెడ్డి , మలయాళం కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో దిల్ రాజు నిర్మించిన “రౌడీ బాయ్స్” ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డికి ఇదే తొలి సినిమా. అనుపమ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా కనిపించింది.
కానీ ఈ సినిమాలో రెచ్చిపోయి నటించినట్లు టాక్. వ్యక్తిగత ఇమేజ్ లేకుండా.. రెమ్యూనరేషన్ కోసం కొత్త కుర్రాళ్లకు లిప్లాక్ ఇచ్చేస్తావా..? కిస్ సీన్ చేయడానికి ఓ స్థాయి ఉండాలని.. అగ్ర నిర్మాత కొడుకు అయినంత మాత్రానా కిస్ ఇచ్చేస్తారా.. రెమ్యూనరేషన్ కోసం దిగజారి ప్రవర్తిస్తారా? అని అనుపమపై ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఆశిష్, అనుపమ మధ్య దాదాపు 3-4 కిస్సింగ్ సీన్లు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలోకి రానుంది. మరి సినిమా చూసిన తర్వాత ట్రోలర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవల అనుపమకు మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమా ద్వారా అయినా ఆమె మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది. మరి ఆమె నెరవేరుతుందో లేదో తెలియాలంటే.. పండుగ వరకు ఆగాల్సిందే. గతంలో శ్యామ్ సింఘ రాయ్ ట్రైలర్లో నానితో కృతిశెట్టి లిప్-లాక్ సన్నివేశం కనిపించినప్పుడు కూడా చాలామంది నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేశారు. అంతే కాదు.. ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు. పద్ధతిగా కనపడే కృతిశెట్టి.. ఇలా లిప్ లాక్ సీన్లలో నటించడంతో అభిమానులు జీర్ణంచుకోలేక పోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…