ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వైరాలజిస్టు వెండీ బార్క్లే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు మళ్లీమళ్లీ సోకే లక్షణం ఉందని తెలిపారు.
వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతి సంవత్సరం దగ్గు, జలుబు ఏ విధంగా వస్తాయో కరోనా కూడా అదే విధంగా వస్తుందని తెలిపారు. వెండీ బార్క్లే బ్రిటన్ లో 3.65 లక్షల మంది ప్రజలకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల పాటే యాంటీ బాడీలు ఉంటాయని గుర్తించామని… యాంటీబాడీలు లేకపోతే మళ్లీ వైరస్ సోకుతుందని చెప్పారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 26 శాతం మేర యాంటీబాడీలు తగ్గిపోతాయని గుర్తించామని.. వృద్ధుల్లో త్వరగా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.
మరోవైపు భారత్ లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య సగానికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటే ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…