ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.కొందరిలో కొద్దిగా లక్షణాలు మొదలవగానే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని జాగ్రత్త వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ర్యాపిడ్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ టెస్టులు అందుబాటులో ఉన్న సంగతి మనకు తెలిసిందే.కానీ కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరు నిర్ధారణ కోసం సిటీ స్కాన్ చేయించడం కోసం పరుగులు తీస్తున్నారు.అయితే మాటిమాటికి సిటీ స్కాన్ చేయించుకోవటం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ తో బాధపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
చాలామంది తమకు కరోనా లక్షణాలు కనిపించిన టెస్టులలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు.లక్షణాలు కనిపించిన వెంటనే సిటి స్కాన్ చేయించుకోవటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.అప్పటికి ఈ వైరస్ మన ఊపిరితిత్తులలో లోడ్ కాకపోవటం వల్ల మనకు ఫలితాలలో ఎటువంటి రిజల్ట్ కనపడదు. రెండు మూడు రోజుల తర్వాత వైరస్ ఊపిరితిత్తులకు చేరి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఎదురవుతాయి అలాంటి సమయంలో మరోసారి చేయించుకుంటారు. ఈ విధంగా పలుమార్లు సిటి స్కాన్ చేయించుకోవటం వల్ల మన శరీరం అధిక రేడియేషన్ కి గురవుతోందని వైద్యులు సూచిస్తున్నారు. మరి సిటి స్కాన్ ఎప్పుడు అవసరం? ఎవరు చేయించుకోవాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ఆర్టీపీసీఆర్లో కోవిడ్ నెగటివ్ వచ్చి.. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా చెస్ట్ సిటీ స్కాన్,చెస్ట్ ఎక్స్రే అవసరమవుతుంది.అదేవిధంగా కరోనా బారినపడి ఆరోగ్యం బాగా క్షీణించినట్లయితే అలాంటి వారి ఊపిరితిత్తులలో వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ అవసరమవుతుంది.
ఇతర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారికి డాక్టర్లు సిటి స్కాన్ సిఫార్సు చేస్తారు. కొందరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు వారిలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయి ఊపిరితిత్తులు బాగా కుచించుకు పోతాయి.అలాంటి వారిలో వైరస్ తీవ్రతను కనుక్కోవడం కోసం డాక్టర్లు సిటీ స్కాన్ సిఫార్సు చేస్తారు. వయసు పై పడి షుగర్ బీపీ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా సిటిస్కాన్ అవసరమవుతుంది. ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడే వారు మాత్రమే డాక్టర్ల సూచన మేరకు సిటి స్కాన్ చేయించుకోవాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండా సిటి స్కాన్ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.ఈ విధంగా పదేపదే సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల మన శరీరం పై అధిక రేడియేషన్ కలిగి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి…
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 33 ఏళ్ల త్విషా శర్మ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం ఐదు నెలల క్రితమే…
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే వ్యాఖ్యలు…
వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహం జరిగే ప్రదేశంగా కూడా…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం త్వరలో హైటెక్ మార్పులకు సిద్ధమవుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం…
దేశంలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్రం పెట్రోల్,…