Crime News: దేశ రాజధానిలో దారుణం..! బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తి!
Crime News: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడుతూ.. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. దీంతో పాటు వారిపై దాడుల కూడా పాల్పడుతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి.
తాజాగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం ఎరుగని ఓ బాలికపై ఓ నిందితుడు.. దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. బూటుతో తన్నుతూ.. కర్రతో బాదుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు.
ఢిల్లీలో పశ్చిమ విహార్ ప్రాంతంలో ఈ అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై దాడికి పాల్పడుతున్న వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలికను పట్టుకుని సదరు వ్యక్తి కర్రలతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. పారిపోయేందుకు బాలిక ప్రయత్నించినా.. వదలకుండా దాడి చేశాడు. అనంతరం బూటు కాలితో తీవ్రంగా తన్నాడు.
దీనిపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పుటేజీని అందచేసింది. నిందితుడు డ్రగ్స్ కు బానిసగా మారినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలికను కొందరు బంధించినట్లు ఆమె.. జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…