Crime News: దేశ రాజధానిలో దారుణం..! బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తి!
Crime News: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడుతూ.. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. దీంతో పాటు వారిపై దాడుల కూడా పాల్పడుతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి.
తాజాగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం ఎరుగని ఓ బాలికపై ఓ నిందితుడు.. దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. బూటుతో తన్నుతూ.. కర్రతో బాదుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు.
ఢిల్లీలో పశ్చిమ విహార్ ప్రాంతంలో ఈ అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై దాడికి పాల్పడుతున్న వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలికను పట్టుకుని సదరు వ్యక్తి కర్రలతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. పారిపోయేందుకు బాలిక ప్రయత్నించినా.. వదలకుండా దాడి చేశాడు. అనంతరం బూటు కాలితో తీవ్రంగా తన్నాడు.
దీనిపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పుటేజీని అందచేసింది. నిందితుడు డ్రగ్స్ కు బానిసగా మారినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలికను కొందరు బంధించినట్లు ఆమె.. జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…