దళిత బంధు కోసల్లే ప్రోగ్రాం కాదు_ ఈటల రాజేందర్

తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కొసల్లే ప్రోగ్రాం కాదన్నారు. టిఆర్ఎస్ నేతలు గెలవలేమని నిర్ధారణకు వచ్చి చిల్లర పనులకు ఒడిగడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పథకాలన్నీ నా వల్లే వస్తున్నాయని.. నాకే ఓటేస్తామని హుజరాబాద్ ప్రజలు అంటున్నారని ఈటెల స్పష్టం చేశారు.

కాగా హుజురాబాద్ ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు ఈటెల. కేసిఆర్ ఎప్పుడు ఓట్ల కోణంలోనే ఆలోచిస్తారని.. ప్రజల కోణంలో ఆలోచించరని ధ్వజ మెత్తారు. సొంత పార్టీ నేతలను వెలకట్టే నీచానికి కేసీఆర్ దిగజారారని అన్నారు. అక్రమ సంపాదన ప్రభుత్వ ధనంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది తానేనని ఈటెల పేర్కొన్నారు.