శ్రీకృష్ణుని మరణ రహస్యం !!

ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.

ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం వరకూ ప్రయాణమై వచ్చాడు. తపోవనమంతా వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునుడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అంత్యక్రియలు పూర్తిచేసేసాడు.

అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మనమంతా కూడా కాల గమనంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా ఏ శిక్ష నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సర్వే జనా సుఖినోభవంతు

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

స్లో ఓవర్ రేట్ దెబ్బకు పాకిస్థాన్‌కు భారీ షాక్.. ICC కఠిన చర్యలు

అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి…

58 minutes ago

నోయిడాలో పెళ్లైన 5 నెలలకే యువతి అనుమానాస్పద మృతి.. వేధింపుల ఆరోపణలు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 33 ఏళ్ల త్విషా శర్మ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం ఐదు నెలల క్రితమే…

1 hour ago

తమిళనాడులో విజయ్ లాగా.. తెలంగాణలో నేనే అధికారంలోకి వస్తా: కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే వ్యాఖ్యలు…

4 hours ago

తలుపు వెనుక ఇవి పెడితే నిజంగా దురదృష్టమా? వాస్తు నిజాలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహం జరిగే ప్రదేశంగా కూడా…

4 hours ago

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో AI సేవలు.. భక్తులకు స్మార్ట్ దర్శనం వైపు అడుగు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం త్వరలో హైటెక్ మార్పులకు సిద్ధమవుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం…

4 hours ago

భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై మళ్లీ భారమే

దేశంలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్రం పెట్రోల్,…

5 hours ago