Featured

Dharmavarapu subhramanyam son Ravi : నాన్న చనిపోతే ఇండస్ట్రీ నుండి వాళ్లిద్దరు తప్ప ఇంకెవరూ రాలేదు…: ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు రవి బ్రహ్మ తేజ

Dharmavarapu Subhramanyam Son Ravi : ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సినిమా ద్వారా తెలుగులో కమెడియన్ గా స్థిరపడిపోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో సినిమాల్లో తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. ఆయన సినిమాల్లో చేస్తూనే మరోవైపు బుల్లితెర మీద షోలలో చేసేవారు. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గారికి స్నేహితుడు కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ తరుపున పనిచేసారు. ఇక సాక్షి ఛానెల్ లో వచ్చే రాజకీయ పేరడి కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ను కూడా నిర్వహించిన ఆయన 2013లో లివర్ క్యాన్సర్ బాధపడుతూ మరణించారు. ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను ఆయన కొడుకు రవి బ్రహ్మ తేజ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నాన్న చనిపోతే ఎవరూ రాలేదు…

ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి ఆయన కొడుకు రవి మాట్లాడుతూ ఆయన సింపుల్ గా ఉండేవారని అంత పెద్ధ కమెడియన్ అయినా కూడా క్యారవాన్ వినియోగించేవారు కాదని తెలిపారు. ఇక ప్రొడ్యూసర్ లను ఇబ్బంది పెట్టకుండా రెమ్యూనరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేసేవారు కాదని, వాళ్ళు ఇచ్చుకోలేమని చెబితే వాళ్ళు ఇచ్చింది తీసుకుని సినిమాలను చేశారని, ఆయన అతి మంచితనంను చాలా మంది వాడుకున్నారని తెలిపారు రవి.

ఇక ఆయనతో పాటు ‘జై చిరంజీవ’ సినిమా షూటింగ్ కి వెళ్ళినపుడు చిరంజీవి గారితో మాట్లాడానని అదే మొదటి సారి చివరి సారి అంటూ తెలిపారు. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు మరణిస్తే ఇండస్ట్రీ నుండి చూడటానికి ఎవరూ రాలేదని ఆయన కొడుకు రవి తెలిపారు. కేవలం మూవీ మొఘల్ రామా నాయుడు గారు హీరో గోపీచంద్ గారు మాత్రమే వచ్చారని తెలిపారు. రామా నాయుడు గారు అనారోగ్యంతో సహకరించక పోయినా తన తండ్రిని చూడటం కోసం వచ్చారని తెలిపారు.

Bhargavi

Recent Posts

కోటిన్నర రూపాయల ఇంజెక్షన్ కోసం పోరాటం.. స్పందించిన సీఎం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…

14 hours ago

బెంగళూరులో చిన్నారి మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మూడు నెలల తర్వాత తల్లి అరెస్ట్..

బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…

15 hours ago

ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ టమాటాలు.. గుర్తించే సింపుల్ టెస్టులు ఇవే..

ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…

16 hours ago

మామిడి పండ్లు తిన్న తర్వాత అనారోగ్యం.. ఇద్దరు బాలికల మరణం కలకలం

హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…

16 hours ago

ప్రపంచానికి కొత్త వాతావరణ హెచ్చరిక.. ‘గాడ్జిలా ఎల్‌నినో’పై నిపుణుల ఆందోళన

ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

18 hours ago

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…

18 hours ago