Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని మెగాస్టార్ అనే బిరుదుతో ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరంజీవి గురించి అందరికీ సుపరిచితమే. ఈయన నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధవళ సత్యం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న క్రమంలో, ధవళ సత్యం దర్శకత్వంలో జాతర సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా అల్లు అరవింద్ పని చేశారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం అనంతరం మెగాస్టార్ కి మరిన్ని అవకాశాలు రావడం ఆయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం జరిగిపోయింది.
ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా జాతర సినిమాని కాపీ కొట్టారు అంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన దవళ సత్యం తాను ఇప్పటివరకు రంగస్థలం సినిమా చూడలేదని తెలియజేశారు. రంగస్థలం సినిమా విడుదల అవగానే ఎంతో మంది తనకు ఫోన్ చేసి జాతర సినిమా దించేసారని చెప్పినట్లు ఈ సందర్భంగా ధవళ సత్యం వెల్లడించారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గురించి అల్లు రామలింగయ్య ఒక సందర్భంలో తన వద్దకు చిరంజీవి గురించి ఆరా తీశారు. ఈ విధంగా అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి అడగడంతో తన గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పాను. అయితే అబ్బాయిని చూడచ్చు అంటారా అని రామలింగయ్య అడిగారు. ఇక అప్పుడు నాకు తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారని అర్థం అయి తను ఎప్పటికైనా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారని, కుర్రాడు చాలా మంచోడని అల్లు రామలింగయ్య దగ్గర చెప్పినట్లు ధవళ సత్యం ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ఇకపోతే చిరంజీవి తండ్రికి ఈ విషయాన్ని చెప్పగా ఆయన చిరంజీవి పెళ్ళి సురేఖ గారితో చేయడానికి ఇష్టపడలేదు. అందుకు గల కారణం అల్లు రామలింగయ్య కుటుంబం సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అమ్మాయి అంటే తను తన ఫ్యామిలీలో ఉండగలదా అంటూ వీరి పెళ్లి చేయడానికి నిరాకరించారు. ఆ సమయంలో నేను అల్లు రామలింగయ్య కుటుంబం గురించి వివరించడం వల్ల ఆయన తన పెళ్లికి ఒప్పుకున్నారని అలా చిరంజీవి గారి పెళ్లి జరిగిందని సత్యం ఈ సందర్భంగా తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…