Movie News

Tanikella Bharani: త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి రచయితలు అందరికీ రెమ్యూనరేషన్ పెంచాడు.. అప్పట్లో ఐదు వేలు మాత్రమే కానీ ఇప్పుడు.. : తనికెళ్ల భరణి

Tanikella Bharani: తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఎంతోమంది నేను సెట్ లోకి వెళ్ళగానే ఒక కాలి పేపర్ ఇచ్చి నా డైలాగ్స్ నన్ను రాసుకోమని చెప్పేవారు.

రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఇది నాకు చాలా డిసడ్వాంటేజెస్ గా ఉండేదని,మరికొందరైతే దారుణంగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు సార్ అంటూ నా చేత డైలాగులు రాయించుకునే వారంటూ తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే అప్పట్లో రచయితలకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించారు.

అప్పట్లో రచయితలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నాకు కేవలం ఐదు వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారో అప్పుడే రచయితలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తనికెళ్ల భరణి వెల్లడించారు.

డైరెక్టర్లకు సమానంగా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రచయితగా పని చేస్తే ఆయన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రచయితలకు డైరెక్టర్లకు ఒకే ఈ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తనికెళ్ళ భరణి వెల్లడించారు. అప్పట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రచయితలకు మంచి సంపాదన ఉంటుందని తనికెళ్ల భరణి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago