Movie News

Tanikella Bharani: త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి రచయితలు అందరికీ రెమ్యూనరేషన్ పెంచాడు.. అప్పట్లో ఐదు వేలు మాత్రమే కానీ ఇప్పుడు.. : తనికెళ్ల భరణి

Tanikella Bharani: తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలకు రచయితగా, ఎన్నో సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో తాను రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఎంతోమంది నేను సెట్ లోకి వెళ్ళగానే ఒక కాలి పేపర్ ఇచ్చి నా డైలాగ్స్ నన్ను రాసుకోమని చెప్పేవారు.

రచయితగా నటుడిగా ఉండటం వల్ల ఇది నాకు చాలా డిసడ్వాంటేజెస్ గా ఉండేదని,మరికొందరైతే దారుణంగా మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకు సార్ అంటూ నా చేత డైలాగులు రాయించుకునే వారంటూ తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే అప్పట్లో రచయితలకు ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించారు.

అప్పట్లో రచయితలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను రచయిత గా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నాకు కేవలం ఐదు వేలు మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి రచయితలు ఇండస్ట్రీలోకి వచ్చారో అప్పుడే రచయితలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తనికెళ్ల భరణి వెల్లడించారు.

డైరెక్టర్లకు సమానంగా…

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రచయితగా పని చేస్తే ఆయన డైరెక్టర్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రచయితలకు డైరెక్టర్లకు ఒకే ఈ రకమైన ప్రాధాన్యత ఇస్తున్నారని, రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని తనికెళ్ళ భరణి వెల్లడించారు. అప్పట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రచయితలకు మంచి సంపాదన ఉంటుందని తనికెళ్ల భరణి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

19 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

19 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago