Allu Arjun: ఆ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటమేకాకుండా మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ పెద్దఎత్తున డబ్బును సంపాదిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చేసిన ప్రతి ఒక్క ప్రకటన కూడా పలు వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈయన చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి ఒక వ్యాపార ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.
ఈ విధంగా అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనలో పూర్తిగా అవాస్తవాలే ఉన్నాయని, ఈ ప్రకటన అందరిని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన చైతన్య విద్యా సంస్థల పై అలాగే ఈ ప్రకటనలో నటించిన అల్లు అర్జున్ పై ఈయన అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల జూన్ 6వ తేదీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి పలు పత్రికల్లో ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశారు.అయితే ఈయన ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చైతన్య విద్యా సంస్థల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకవైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తరుచు వివాదాల్లో నిలుస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈయన పలు బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన జొమాటో, ర్యాపిడో ప్రకటనలో కూడాపెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం మర్చిపోకముందే మరోసారి చైతన్య విద్యా సంస్థల నుంచి ఈయన ఈ విధమైనటువంటి వివాదంలో చిక్కుకున్నారు.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…