అలనాటి హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన ఈమె నటనలోనే కాకుండా కథకురాలిగా.. నిర్మాతగా అనుభవం ఉంది. సుహాసిని మొదట 1980 లో ‘నెంజతై కిల్లతే ’ అనే తమిళ చిత్రంలో నటించారు. తర్వాత ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే.
అయితే సుహాసిని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఆమె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మంచిదొంగ’, ‘ఆఖరి పోరాటం’ చిత్రాల్లో నటించారు. మంచిదొంగ సినిమాలో చిరంజీవి సరసన.. ఆఖరిపోరాటం సినిమాలో నాగార్జున సరసన నటించిన విషయం తెలిసిందే.
మంచిదొంగ సినిమాలో సుహాసిని లాయర్ పాత్ర వేయగా.. మరో హీరోయిన్ గా విజయశాంతి ఇన్ స్పెక్టర్ రోల్ చేశారు. ఆఖరిపోరాటంలో మెయిన్ రోల్ గా శ్రీదేవి నటించగా.. సుహాసిని ఆ సినిమాలో చేయమని మొదట చెప్పింది చిరంజీవి అట. నువ్వు ఆఖరిపోరాటం కథను తప్పనిసరిగా వినాలంటూ చెప్పాడట మెగస్టార్. ఈ రెండు సినిమాల్లో మొదట షూటింగ్ మొదలైంది ఆఖరిపోరాటం కాగా.. మొదట థియేటర్లలో విడుదలైంది మాత్రం మంచిదొంగ.
ఆఖరి పోరాటంలో సుహాసిని పాత్రకు మొదట రేవతి అనుకున్నారట. కానీ రైటర్ జంధ్యాల ఆ పాత్రకు సుహాసిని అయితే సరిపోతుందని చెప్పారట. అయితే రాఘవేంద్రరావును సుహాసిని కలిసినప్పుడు నువ్వు ఈ పాత్ర చేయకపోతే రేవతి చేసే విధంగా ఒప్పించు లేదంటే.. నువ్వే చేయాలి అంటూ ఆ దర్శకుడు అన్నాడట. అలా చిరంజీవి రికమండ్ చేయడం.. రాఘవేంద్రరావు స్వయంగా అడగడంతో ఆఖరిపోరాటంలో సుహాసిని నటించారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…