మన భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బియ్యాన్ని వండుకొని తింటుంటారు. అయితే అన్నం వండే సమయంలో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు.. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాలే కాదు దక్షిణ భారత దేశంలో అందరూ అన్నం తింటున్నవాళ్లే. ఇంగ్లాండ్లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్ఫాస్ట్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం..
కీటకాల నుంచి వరిని కాపాడటం కోసం, అధిక దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తున్నారు. ఇది వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా పడుతుందని ఆ అధ్యయనం చెబుతోంది. అయితే ఆ బియ్యం కడిగే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే కడుగుతారు. దీని వల్ల ప్రమాదం ఉంటుందని.. అంతే కాకుండా అన్నాన్ని కూడా పూర్తిగా ఉడికించాలని ఆ అధ్యయనం చెబుతోంది.
అన్నం సరిగ్గా ఉడకబెట్టకపోతే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ బియ్యంతో వండుతున్న అన్నం తినడం కారణంగా ఎంతో కొంత రసాయనాలు మన శరీరంలోకి వెళుతున్నాయని తేల్చారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయన నిర్వాహకులు వెల్లడించారు. అయితే దీనికి ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం మంచిది.
దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ 80 శాతం తగ్గుతాయని చెబుతున్నారు. దక్షిణాదిలో అన్నంతో చేసే పులిహోర, పలావు, కొత్తిమీర అన్నం, కొబ్బరి అన్నం, పుదీన అన్నం, టమాటో అన్నం, వంకాయ రైస్, పొంగలి లాంటి పదార్ధాలు కనీసం 30కి పైగానే ఉంటాయి. ఇక పిండి వంటలలో రకాలలో అయితే లెక్కకు మించి ఉంటాయి. ఇలా ఎన్నో రకాల వంటకాలల్లో కూడా బియ్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. దోశలు చేయడానికి కూడా బియ్యాన్నే ఉపయోగిస్తుంటారు కనుక ఈ బియ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…