Dill Raju Wife Tejaswini reveals the real story behind the wedding story
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో భార్యగా వివాహం చేసుకున్న తేజస్వినీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తేజస్విని, కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను షేర్ చేస్తుంటారు. ఈమెకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
తాజా ఇంటర్వ్యూలో తేజస్విని మాట్లాడుతూ, “నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. మా ఇంట్లో ఏదైనా ఒక సినిమా చూసేవాళ్లం, అది కూడా దసరా పండగలలో మాత్రమే. మొదట దిల్ రాజుతో పరిచయం అయినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు. నేను మొదట ఆయనను డైరెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత గూగుల్ చేశాకే ఆయన నిర్మాత అని తెలిసింది,” అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. “ఆయన మొదటి భార్య మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత, ఈ సంబంధాన్ని కొనసాగించకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ కొంతకాలం తర్వాత జీవితంలో ముందుకెళ్లాలంటే మనతో నిజాయితీగా ఉండే వ్యక్తి సరిపోతాడని అనిపించింది. అలా మళ్లీ ఆయన్ను అంగీకరించాను. మా పెళ్లిపై తుది నిర్ణయం మా మామయ్యదే. ఆయనను దిల్ రాజు ఓసారి ఒప్పించాలా అని అడిగారు. అప్పుడే మా పెద్ద మామయ్యని గురించి చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్లా ఉంటారు. కానీ అనూహ్యంగా మామయ్య ముందుగానే అంగీకరించారు,” అని వివరించారు తేజస్విని.
తాజాగా తేజస్వినీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతగా పేరొందిన దిల్ రాజు గురించి ఆమెకు తొలిసారిగా ఎలాంటి అవగాహన లేకపోవడమే కాకుండా, గూగుల్ చేయాల్సిన అవసరం వచ్చిన కథనాన్ని నెటిజన్లు ఆసక్తిగా చదుతున్నారు.
ఈ సంఘటన తేజస్వినీ నిజాయితీ, ఒప్పుకొన్న జీవితం పట్ల ఉన్న నిజమైన భావాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తేజస్విని, దిల్ రాజు దంపతులు ఆనందంగా తమ కుటుంబ జీవితాన్ని సాగిస్తున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…