టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో భార్యగా వివాహం చేసుకున్న తేజస్వినీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారాయి. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తేజస్విని, కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను షేర్ చేస్తుంటారు. ఈమెకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

తాజా ఇంటర్వ్యూలో తేజస్విని మాట్లాడుతూ, “నాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. మా ఇంట్లో ఏదైనా ఒక సినిమా చూసేవాళ్లం, అది కూడా దసరా పండగలలో మాత్రమే. మొదట దిల్ రాజుతో పరిచయం అయినప్పుడు ఆయన ఎవరో కూడా తెలియదు. నేను మొదట ఆయనను డైరెక్టర్ అనుకున్నాను. ఆ తర్వాత గూగుల్ చేశాకే ఆయన నిర్మాత అని తెలిసింది,” అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. “ఆయన మొదటి భార్య మృతి చెందిన విషయం తెలిసిన తర్వాత, ఈ సంబంధాన్ని కొనసాగించకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ కొంతకాలం తర్వాత జీవితంలో ముందుకెళ్లాలంటే మనతో నిజాయితీగా ఉండే వ్యక్తి సరిపోతాడని అనిపించింది. అలా మళ్లీ ఆయన్ను అంగీకరించాను. మా పెళ్లిపై తుది నిర్ణయం మా మామయ్యదే. ఆయనను దిల్ రాజు ఓసారి ఒప్పించాలా అని అడిగారు. అప్పుడే మా పెద్ద మామయ్యని గురించి చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్లా ఉంటారు. కానీ అనూహ్యంగా మామయ్య ముందుగానే అంగీకరించారు,” అని వివరించారు తేజస్విని.
తాజాగా తేజస్వినీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాతగా పేరొందిన దిల్ రాజు గురించి ఆమెకు తొలిసారిగా ఎలాంటి అవగాహన లేకపోవడమే కాకుండా, గూగుల్ చేయాల్సిన అవసరం వచ్చిన కథనాన్ని నెటిజన్లు ఆసక్తిగా చదుతున్నారు.
ఈ సంఘటన తేజస్వినీ నిజాయితీ, ఒప్పుకొన్న జీవితం పట్ల ఉన్న నిజమైన భావాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తేజస్విని, దిల్ రాజు దంపతులు ఆనందంగా తమ కుటుంబ జీవితాన్ని సాగిస్తున్నారు.





























