Director Geetha Krishna : సీఎం జగన్ పార్టీ లో చాలా రోజులుగా ఉన్న కమెడియన్ అలీ అలాగే పోసాని కృష్ణ మురళి గారికి కొత్త పదవులను ఇచ్చారు. కమెడియన్ అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా విభాగాలని చూసుకోమని అలాగే పోసాని కృష్ణమురళి గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ని ఇచ్చాడు జగన్. ఇక పవన్, చంద్రబాబు టార్గెట్ గానే ఈ పదవులను వారికి ఇచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య సత్సంబందాల నేపథ్యంలో అలీ పవన్ మీద విమర్శలు చేస్తారా అనే విషయంలో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇక ఏ ఈ విషయాల మీద సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ అభిప్రాయాలను తెలిపారు.
కుక్క బిస్కెట్లు వేశారు…
అలీ, పోసాని కి జగన్ కుక్క బిస్కెట్లు వేసాడంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లను విమర్శించడానికే వీరికి పదవులను ఇచ్చారు. ఇక వీరి వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పార్టీ కి ఏదో లాభం ఉంటుందని నేను అనుకోవడం లేదు. పోసానిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను చేయడం ద్వారా సినిమా వాళ్లతో ప్రభుత్వం చర్చించడానికి మధ్యలో పోసానిని పెడతారు. వీళ్ళు సినిమాల్లో పెద్దగా చేసిందేమి లేదు కాట్రే, రాజా అంటూ వాళ్ళకొచ్చిన కామెడీ చేసారు.
ఇప్పుడు ఈ పదవుల ద్వారా వాళ్ళు సంపాదించుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీ కో వైసీపీ పార్టీ కో పెద్దగా ఉపయోగం ఉండదు. బాగా సంపాదించుకుంటే మళ్ళీ ఒక రాజ్యసభ సీటు లాంటింది కొంటారు అంటూ కామెంట్స్ చేసారు. కమెడియన్ అలీ కి సోషల్ మీడియాలో వ్యూయర్ షిప్ బాగానే ఉంది, యూట్యూబ్ లో ఏవైనా ఇంటర్వ్యూలు పెడితే బాగానే జనాలు చూస్తున్నారు కాబట్టి ఆయనని పార్టీ కి వాడుకోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…