Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. రేలంగి గారు కూడా దాసరి నారాయణ రావు గారి శిష్యుడే. దాసరి గారి వద్దే ఉంటూ ఆయనకు దగ్గరగా పనిచేసిన రేలంగి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఎన్టీఆర్ గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు.
డైరెక్టర్స్ కి గౌరవం ఇస్తారు…
ఎన్టీఆర్ గారి ‘సర్ధార్ పాపారాయుడు’ సినిమాకి అనధికారికంగా దాసరి గారి వద్ద ఉండటం వళ్ళ షూటింగ్ పనుల్లో పాల్గొన్న రేలంగి నరసింహారావు గారు ఆ తరువాత ఎన్టీఆర్ గారి ‘సర్కస్ రాముడు’ సినిమాకు ఆఫీసియల్ గా పనిచేసారు. ఇక ఎన్టీఆర్ గారు సెట్స్ లో ఎలా ఉంటారు అనే విషయం మాట్లాడుతూ సర్కస్ రాముడు సినిమాలో ఒక పాట చిత్రీకరణ కోసం స్టిల్స్ తీస్తున్న సమయంలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎన్టీఆర్ గారు ఉంటే దాసరిగారు నల్ల కళ్ళజోడు వద్దు తీసేయమని చెప్పారు. దాంతో ఆయన వెంటనే తీసేసారు అది ఆయన డైరెక్టర్స్ కి ఇచ్చే విలువ అంటూ చెప్పారు.
ఇక మరో షూటింగ్ కోసం ఊటి వెళ్లిన సమయంలో పాట చిత్రీకరణ కోసం ఊటి వెళ్లగా అక్కడే వేరొక చోట యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని మొదట ప్లాన్ చేసి చెప్పినా ఆపైన వెంటనే ఊటి వెళ్ళవలసి రాగా హోటల్ వెళ్లి ఫ్రెష్ అయి మీరు వస్తే ఊటి వెళదాం అని డైరెక్టర్ దాసరి గారు చెబితే పక్కన ఉన్న సెలయేరు లో స్నానం చేసేసి ఊటి వెళ్ళిపోతే సరిపోతుంది కదా మళ్ళీ హోటల్ కి వెళ్లడం ఎందుకు అంటూ ఆయన అక్కడే స్నానం చేసి వచ్చారు. అందుకే ఆయన చైతన్య రథం సమయంలో రోడ్డు పక్కన స్నానం చేసినా మాకు ఆశ్చర్యంగా అనిపించలేదు అంటూ ఆయన అంత ఎత్తు ఏదిగినా చాలా ఒదిగి ఉంటారు అంటూ ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…