Analyst Damu Balaji : ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఓ వైపు జరుగగా ఇక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి నాడు టీడీపీ జరుపుకునే మహానాడు కార్యక్రమం కూడా మొదలయింది. ఆ వేడుకలో టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు పార్టీ కి సంబంధించిన విషయాలను చెప్పడంతో పాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేలా స్పీచ్ లతో నేతలు ఆకట్టుకుంటారు. ఈసారి మహానాడు లో అచ్చెన్నాయుడు మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆయన ఈసారి గెలుపు టీడీపీ దే అని చెబుతూ 160 సీట్లు మనం గెలుస్తాం అంటూ చేసిన వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అంటూ అనలిస్ట్ దాము బాలాజీ ఈ స్పీచ్ గురించి విశ్లేషించారు.
పవన్ ను పక్కన పెట్టిన టీడీపీ…
మహానాడు లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్ లో 160 సీట్లు గెలుస్తుందని జోష్యం చెప్పారు. అయితే 175 సీట్లకు 160 సీట్లు టీడీపీ గెలిస్తే మరి తనతో పాటు ఉన్న జనసేన కు మిగిలిన 15సీట్లు ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలా లేక మిగిలిన సీట్లు వైసీపీ కి అని అర్థం చేసుకోవాలో టీడీపీ వారే క్లారిటీ ఇవ్వాలంటూ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. జగన్ 175 కి 175 గెలుస్తామంటూ చెప్పాడం ఒకింత అసాధ్యమే అయినా మైండ్ గేమ్ ఆడుతున్నాడనేది అర్థం అవుతుంది.
అయితే టీడీపీ లెక్కలలో పరమార్థం పవన్ ను దూరం పెట్టడమే అని అర్థమవుతోందని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. పవన్ తాజాగా మనం ఇంతవరకు ఒక్క సీటు గెలవలేదు, కొన్నైనా గెలిచి ఉంటే సీఎం సీటు గురించి ఆలోచించేవాడిని అన్నట్లు నిరుత్సాహపూరిత మాటలు మాట్లాడటం, తాజాగా టీడీపీ సోషల్ మీడియాలో పవన్ లేకపోయినా టీడీపీ ఒంటరిగా గెలవగలదు అన్నట్లు కామెంట్స్ పెట్టడం పవన్ ను దూరం పెడుతున్నారా అనే అనుమానలను కలిగిస్తున్నాయని బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…