Hero Daggubati Abhiram : దగ్గుబాటి ఇంటి నెక్స్ట్ జనరేషన్ వారసుడిగా సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టబోతున్న మరో నటుడు సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ . ఇప్పటికీ బాబాయ్ వెంకటేష్ నట వారసత్వాన్ని అన్న రానా సినిమాల్లో తానేంటో నిరూపించుకోగా ఇక ఇప్పుడు అభిరామ్ కూడా సినిమాల్లో తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యడు. అయితే సినిమాల్లోకి ఇంకా అడుగుపెట్టక ముందే దగ్గుబాటి అభిరామ్ ఒకానొక సందర్భంలో బాగా వైరల్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి, అభిరామ్ తో తనకు అఫైర్ ఉందంటూ ఫోటోలు బయట పెట్టడంతో అప్పట్లో బాగా వైరల్ అయ్యాడు. సినిమా ప్రొడక్షన్ పనులను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్న అభిరామ్ తాజాగా నటన వైపు ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
తప్పులు అందరు చేస్తారు…..
అభిరామ్ హీరోగా డైరెక్టర్ తేజా దర్శకత్వంలో ‘అహింస’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను స్టార్ట్ చేసిన సినిమా యూనిట్ అందులో భాగంగా పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. అలా అభిరామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన లైఫ్ లోని రీగ్రెట్స్ గురించి ప్రశ్న ఎదురవగా లైఫ్ లో అందరు తప్పులను చేస్తారు వాటి నుండి పాఠాలు నేర్చుకుని మళ్ళీ అడుగు వేస్తారు నేను అంతే అంటూ సమాధానము ఇచ్చాడు.
హీరోగా ఎంట్రీ ఇవ్వడనికి ఇంత లేట్ అవడానికి కారణం తనకు ప్రొడక్షన్ వైపు వెళ్లాలా లేక నటన వైపు వెళ్లాలా అనే కన్ఫ్యూషన్ లో ఉండి ఆలస్యమైందని చెప్పారు. సినిమాలో డైరెక్టర్ తేజ ఏం చెబితే అది చేసినట్లు ఆయన ఒక మాస్టర్ అంటూ ఆయన చెప్పినట్లు చేస్తే చాలా నేర్చుకోవచ్చు అంటూ చెప్పారు. తన అన్న రానా దగ్గుబాటి కూడా అదే సలహా ఇచ్చాడంటూ అభిరామ్ చెప్పాడు . ఇక నెపోటిజం గురించి మాట్లాడుతూ నెపో కిడ్స్ అయినా టాలెంట్ లేకపోతే కెరీర్ ఉండదని అధికాక ప్రేక్షకుల నుండి ఎన్నో అంచనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక ఇమేజ్ ను వాళ్ళు ఏర్పరుచుకుంటారని వాటిని దాటుకుని నిలబడగలగాలని చెప్పాడు.
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…
హిందూ ఆలయాలకు వెళ్లే భక్తులు సాధారణంగా గర్భగుడిలో స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ…
హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…
హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…