నిత్యం ఎదో ఒక విషయంపై సెటైరికల్ కామెంట్స్ చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజగా నెల్లూరు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య గరించి తనదైన శైలిలో కామెంట్స్ చేసాడు. “ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడేన్, డా.ఫాసీ వెళ్తున్నారని విన్నాను. ఆనందయ్యతో కరోనా రెసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికి ఉండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, మిలటరీ బలగాలతో భద్రతా కల్పించవచ్చు కదా..” అంటూ ట్విట్టర్ లో అర్జీవీ మార్క్ సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేసాడు.
కరోనా కి ఉచితంగా పసర మందు ఇస్తూ గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అయ్యారు ఆనందయ్య. కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రజలు కృష్ణపట్నం బాట పట్టరు. ఈ ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో దేశవ్యాప్తంగా ఆనందయ్య మందుకు డిమాండ్ భారీగా పెరిగింది. భారీగా జనాలు చేరుకోవడంతో నిన్న ఆయుర్వేద మందు పంపిణీకి తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…