Disha Patani : ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తరువాత సలార్, ప్రాజెక్ట్ కె చిత్రలలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తన తోటి నటీ నటులతో చాలా సరదాగా వుంటారని అందరు అంటుంటారు. అంతేకాకుండా తన సినిమా షూటింగ్ లు హైదరాబాద్ లో జరిగితే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన నటీ నటులకు తన ఇంటి భోజనం తినిపించడం తనకి ఇష్టమట. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ నటీ నటులు ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసారట. అయితే ప్రస్తుతం ఈ జాబితా లోకి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కూడా చేరిపోయింది.
ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన దిశా….
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ని ఎంపికచేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దిశా పటాని కి సంబంధించిన సన్నివేశాలు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ షూటింగ్ నిమిత్తం దిశా పటాని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ షూటింగ్ లో పాల్గొన్న దిశా పటాని కి ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం రుచి చూపించారట. అయితే ప్రభాస్ ఇంటి నుంచి తెప్పించిన ఆహార పదార్థాలకు ఫిదా అయిన దిశా ఈ విషయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎపుడు డైటింగ్ అంటూ ఇష్టమైన ఫుడ్ ని పక్కన పెట్టే మన హీరోహీరోయిన్లు ఇలాంటి ఇంటి భోజనం తిన్నాక ఫిదా అవ్వాల్సిందే మరి . అందుకే దిశాపటాని సోషల్ మీడియా వేదికగా “థాంక్యూ ప్రభాస్… మమ్మల్ని చెడగొట్టేశావ్” అంటూ స్పందించంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…