పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నిమ్మరసాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మరసం వల్ల శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ నిమ్మరసం తీసుకునే వారిలో నిమ్మలో ఉండే యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. మానసిక సమస్యలతో బాధ పడే వాళ్లు నిమ్మరసం తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
నిమ్మరసం చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని నియంత్రించడంతో పాటు పంటినొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం శరీరంలో కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సులభంగా తొలగిస్తుంది. రోజూ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగేవారు బరువు సులభంగా తగ్గవచ్చు. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలోని చిన్నచిన్న రాళ్లను సైతం కరిగించగలుగుతుంది.
అలసటతో బాధ పడుతున్న వారు నిమ్మరసం తాగితే తక్కువ సమయంలోనే వారికి శక్తి లభిస్తుంది. అయితే నిమ్మరసం సాధారణంగా తాగితే ఎంత మేలు జరుగుతుందో నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. నిమ్మరసం నీటిలో కలిపి ఎక్కువసార్లు తాగితే దంతాలు దెబ్బ తినే అవకాశం ఉంది. దంతాల పై పొర అయిన ఎనామిల్ ను నిమ్మరసం దెబ్బ తీస్తుంది.
ఎక్కువగా నిమ్మరసం తాగే వారిలో అల్సర్, అసిడిటీ సమస్యలు వస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశొధనల్లో తేలింది. వైద్యులు నిమ్మరసం ఎక్కువగా తాగే వారికి మూత్ర సంబంధిత వ్యాధులు వస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ప్రతిరోజూ నిమ్మరసం తాగితే నాలుకపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా నిమ్మరసం తాగితే మైగ్రేన్ సమస్య బారిన పడే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…