కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి దేశంలో ఉన్న వ్యాపారులు, ఉద్యోగులపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఎప్పుడూ నష్టాల ఊసే తెలియని వ్యాపారాలు సైతం నష్టాల బాట పట్టాయి. దేశంలో ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కరోనా వ్యాప్తి వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయి కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో మోదీ సర్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మరోసారి పనిదినాలను పెంచింది. కేంద్రం దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభణ తరువాత ఉపాధి హామీ పథకానికి భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. దీంతో కేంద్రం పని దినాలను ఏకంగా 281 పనిదినాల నుంచి 300 పనిదినాలకు పెంచింది. అయితే కేంద్రం ఈ పనిదినాలను ఏకంగా 320 పనిదినాలకు పెంచే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పనిదినాలతో పాటు కేంద్రం ఉపాధి హామీ అవకాశాలను కూడా పెంచింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో ఎనిమిది పెద్ద రాష్ట్రాలు పనిదినాలను పెంచాలని కోరడంతో కేంద్రం మరింత పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్రం పని దినాలను పెంచే దిశగా అడుగులు వేయడంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…