Featured

పేదలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం…?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా విజృంభణ, లాక్ డౌన్ తరువాత పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి దేశంలో ఉన్న వ్యాపారులు, ఉద్యోగులపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఎప్పుడూ నష్టాల ఊసే తెలియని వ్యాపారాలు సైతం నష్టాల బాట పట్టాయి. దేశంలో ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కరోనా వ్యాప్తి వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయి కుటుంబ పోషణ కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో మోదీ సర్కార్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మరోసారి పనిదినాలను పెంచింది. కేంద్రం దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం కరోనా విజృంభణ తరువాత ఉపాధి హామీ పథకానికి భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. దీంతో కేంద్రం పని దినాలను ఏకంగా 281 పనిదినాల నుంచి 300 పనిదినాలకు పెంచింది. అయితే కేంద్రం ఈ పనిదినాలను ఏకంగా 320 పనిదినాలకు పెంచే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. పనిదినాలతో పాటు కేంద్రం ఉపాధి హామీ అవకాశాలను కూడా పెంచింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో ఎనిమిది పెద్ద రాష్ట్రాలు పనిదినాలను పెంచాలని కోరడంతో కేంద్రం మరింత పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్రం పని దినాలను పెంచే దిశగా అడుగులు వేయడంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

22 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

23 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago