General News

పాక్ కు చుక్కలు చూపించిన సైనికుడు.. మహావీర చక్ర అందుకున్న అతడు ఎవరు..?

పదిహేడు సంత్సరాల వయస్సులో అతడు భారతీయ ఆర్మీలో చేరాడు. 1962 చైనా యుద్ధంలో, 1965 పాక్‌తో జరిగిన యుద్ధంలో అతడి ధైర్య సాహసాలు అమోఘం. ఇలా భారత్ కోసం ఎన్నో యుద్దాలు చేసి 1984 వరకు మాతృభూమికి సేవలందించిన వీర కెరటం పేరు చెవాంగ్‌ రిన్‌చెన్‌. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలోని లద్దాఖ్‌లో జన్మించిన రిన్‌చెన్‌ పేరు చెబితేనే పాక్‌ వణికిపోయేది. అతడి వ్యూహాలు శత్రువులను మట్టికరిపించేంత ఉంటాయి.

1947-48 పాక్‌ యుద్ధంలో పాక్ దళాలు లద్దాఖ్ వైపు వస్తుంటే.. పసిగట్టిన కెప్టెన్‌ ప్రీతిచంద్‌ నేతృత్వంలో రిన్‌చెన్‌తో పాటు మరి కొందరు సైనికులు ముందుగానే లద్దాఖ్‌ చేరేందుకు వ్యూహం రచించారు. అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. అయినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. ఏ మాత్రం అక్కడ అజాగ్రత్తగా ఉన్నా చనిపోవడం ఖాయం.

జాగ్రత్తగా వాళ్లు లద్దాఖ్ వైపు పయనించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పాక్ సైన్యం ఆలోచనను విరమించుకున్నాయి. ఆ సమయంలో మన సైనికులు అక్కడికి చేరకుంటే.. ఆ ప్రాంతం పాక్‌ స్వాధీనమైవుండేది. ఇలా అతడు ధైర్య సాహసాలను చూపిస్తూ.. పాక్ కు చుక్కలు చూపించాడు. 1971 లో కూడా భంగ్లా విముక్తికి జరిగిన పోరాటంలో ఆయన సాహసం పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుంది.

రిన్‌చెన్‌ పెద్దగా చదువుకోలేదు. కానీ అతడు చేసిన పోరాటం మూలంగానే లద్దాఖ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రిన్‌చెన్‌ను భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. అంత చిన్న వయస్సులో చేరి మహావీర చక్ర అవార్డు అందుకున్న అతడి ధైర్య సాహసాలను స్వాతంత్ర్య దినోత్సవం రోజున సోషల్ మీడియాలో నెటిజన్లు స్మరించుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

11 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

12 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

19 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

20 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

20 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago