పదిహేడు సంత్సరాల వయస్సులో అతడు భారతీయ ఆర్మీలో చేరాడు. 1962 చైనా యుద్ధంలో, 1965 పాక్తో జరిగిన యుద్ధంలో అతడి ధైర్య సాహసాలు అమోఘం. ఇలా భారత్ కోసం ఎన్నో యుద్దాలు చేసి 1984 వరకు మాతృభూమికి సేవలందించిన వీర కెరటం పేరు చెవాంగ్ రిన్చెన్. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలోని లద్దాఖ్లో జన్మించిన రిన్చెన్ పేరు చెబితేనే పాక్ వణికిపోయేది. అతడి వ్యూహాలు శత్రువులను మట్టికరిపించేంత ఉంటాయి.
1947-48 పాక్ యుద్ధంలో పాక్ దళాలు లద్దాఖ్ వైపు వస్తుంటే.. పసిగట్టిన కెప్టెన్ ప్రీతిచంద్ నేతృత్వంలో రిన్చెన్తో పాటు మరి కొందరు సైనికులు ముందుగానే లద్దాఖ్ చేరేందుకు వ్యూహం రచించారు. అక్కడ మంచు విపరీతంగా కురుస్తోంది. అయినా అతడు ఏ మాత్రం అధైర్యపడలేదు. ఏ మాత్రం అక్కడ అజాగ్రత్తగా ఉన్నా చనిపోవడం ఖాయం.
జాగ్రత్తగా వాళ్లు లద్దాఖ్ వైపు పయనించారు. ఈ విషయాన్ని పసిగట్టిన పాక్ సైన్యం ఆలోచనను విరమించుకున్నాయి. ఆ సమయంలో మన సైనికులు అక్కడికి చేరకుంటే.. ఆ ప్రాంతం పాక్ స్వాధీనమైవుండేది. ఇలా అతడు ధైర్య సాహసాలను చూపిస్తూ.. పాక్ కు చుక్కలు చూపించాడు. 1971 లో కూడా భంగ్లా విముక్తికి జరిగిన పోరాటంలో ఆయన సాహసం పోరాటానికి నిదర్శనంగా నిలుస్తుంది.
రిన్చెన్ పెద్దగా చదువుకోలేదు. కానీ అతడు చేసిన పోరాటం మూలంగానే లద్దాఖ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. రిన్చెన్ను భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. అంత చిన్న వయస్సులో చేరి మహావీర చక్ర అవార్డు అందుకున్న అతడి ధైర్య సాహసాలను స్వాతంత్ర్య దినోత్సవం రోజున సోషల్ మీడియాలో నెటిజన్లు స్మరించుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…