Aata Winner Geethika: ఆట-4 డాన్స్ విన్నర్ గీతిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Aata Winner Geethika: బుల్లి తెరపై ఎన్నో డాన్స్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే గతంలో ఆట కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది. ఆట 4 అంటేనే అందరికీ గీతిక గుర్తుకు వస్తారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజేతగా నిలబడిన గీతిక ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది.
ఈ విధంగా ఆట డాన్స్ విన్నర్ ఇప్పుడు ఏం చేస్తుంది, అనే విషయాలు ఎవరికి తెలియదు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గీతిక ఆ తర్వాత పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. ఇప్పటివరకు ఈమె ఎలాంటి టీవీ కార్యక్రమాలలోనూ, షోలలోనూ పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం గీతిక ఏం చేస్తుంది,ఎక్కడ ఉందనే విషయాన్ని వస్తే..
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డాన్స్ అంటే ఎంతో పిచ్చి ఉన్న తనకు ప్రస్తుతం ఏ కార్యక్రమాలలో పాల్గొనకుండా దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అనే విషయాలను వెల్లడిస్తూ… తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఇలా తల్లిదండ్రులు దుబాయ్ వెళ్లడంతో తను కొన్ని రోజులపాటు బుల్లితెర కార్యక్రమాలకు విరామం ఇచ్చానని అయితే ఆ విరామం అలాగే కొనసాగుతూ వచ్చిందని ఈమె వెల్లడించారు.
ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పుడు చదువుపై శ్రద్ధ పెట్టాను అయితే ఎడ్యుకేషన్ కంఫర్ట్ గా ఉండడంతో తాను అలాగే హయ్యర్ స్టడీస్ లో ముందుకు వెళ్లానని, ప్రస్తుతం తాను బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. ఇకపోతే చాలామంది తనకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే ఈ కార్యక్రమాలకు దూరమయ్యానని భావిస్తున్నారు. ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని హయ్యర్ స్టడీస్ కారణంగానే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా గీతిక వెల్లడించారు. ఇకపోతే తనకు డాన్స్ షో లోనైనిక పర్ఫామెన్స్ నచ్చుతుందని తనకి ఇష్టమైన హీరో మహేష్ బాబు అని ఈ సందర్భంగా ఈమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…