Aata Winner Geethika: ఆట-4 డాన్స్ విన్నర్ గీతిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Aata Winner Geethika: బుల్లి తెరపై ఎన్నో డాన్స్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే గతంలో ఆట కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది. ఆట 4 అంటేనే అందరికీ గీతిక గుర్తుకు వస్తారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి విజేతగా నిలబడిన గీతిక ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది.
ఈ విధంగా ఆట డాన్స్ విన్నర్ ఇప్పుడు ఏం చేస్తుంది, అనే విషయాలు ఎవరికి తెలియదు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న గీతిక ఆ తర్వాత పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యారు. ఇప్పటివరకు ఈమె ఎలాంటి టీవీ కార్యక్రమాలలోనూ, షోలలోనూ పాల్గొనలేదు. అయితే ప్రస్తుతం గీతిక ఏం చేస్తుంది,ఎక్కడ ఉందనే విషయాన్ని వస్తే..
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. డాన్స్ అంటే ఎంతో పిచ్చి ఉన్న తనకు ప్రస్తుతం ఏ కార్యక్రమాలలో పాల్గొనకుండా దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అనే విషయాలను వెల్లడిస్తూ… తన తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఇలా తల్లిదండ్రులు దుబాయ్ వెళ్లడంతో తను కొన్ని రోజులపాటు బుల్లితెర కార్యక్రమాలకు విరామం ఇచ్చానని అయితే ఆ విరామం అలాగే కొనసాగుతూ వచ్చిందని ఈమె వెల్లడించారు.
ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పుడు చదువుపై శ్రద్ధ పెట్టాను అయితే ఎడ్యుకేషన్ కంఫర్ట్ గా ఉండడంతో తాను అలాగే హయ్యర్ స్టడీస్ లో ముందుకు వెళ్లానని, ప్రస్తుతం తాను బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. ఇకపోతే చాలామంది తనకు యాక్సిడెంట్ అవ్వడం వల్లే ఈ కార్యక్రమాలకు దూరమయ్యానని భావిస్తున్నారు. ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని హయ్యర్ స్టడీస్ కారణంగానే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని ఈ సందర్భంగా గీతిక వెల్లడించారు. ఇకపోతే తనకు డాన్స్ షో లోనైనిక పర్ఫామెన్స్ నచ్చుతుందని తనకి ఇష్టమైన హీరో మహేష్ బాబు అని ఈ సందర్భంగా ఈమె తన అభిప్రాయాలను వెల్లడించారు.
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…