ఎవరు మీలో కోటీశ్వరులు.. ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న రియాల్టీ షో. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనిలో సామాన్యలతో పాటు.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా గెస్ట్ గా వస్తున్నారు. ప్రస్తుతం ఈ షో ముగింపు దశకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ షోను మరింత స్పెషల్ గా మార్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈ షోకు సంబంధించి అప్ డేట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి ఎంతో మంది సెలెబ్రిటీలు గెస్ట్ గా రాగా.. మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలిగెస్ట్ కూడా అతడే. ఆరోజు వాళ్లిద్దరు చేసిన సందడి మామూలుగా లేదు. వీరిద్దరి ఫ్యాన్స్ చూసి పండగ చేసుకున్నారు. అతడి తర్వాత సమంత, తమన్, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ కూడా వచ్చారు.
కొరటాల శివ, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ షోలో కనిపించారు. ఇలా ఈ షో రేటింగ్ పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ షోకు మరో సూపర్ గెస్ట్ వచ్చాడు. ఆయనెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎన్టీఆర్ కు .. మహేశ్ బాబుకు మంచి స్నేహం ఉంది. ఆ సాద్న్నిహిత్యంతోనే అప్పట్లో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ వచ్చాడు. ఈ షోకు వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్పై సెటైర్ల వర్షం కురిపించాడు మహేశ్ బాబు.
దీనికి సంబంధించి ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే మహేశ్ బాబు ఈ షోలో ఎంత వరకు గెలుచుకున్నాడనే విషయం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అతడు రూ.25 లక్షల వరకు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అంటే 13 ప్రశ్నల వరకు కరెక్ట్ గా సమాధానలు చెప్పారు. రూ.50 లక్షల రూపాయల ప్రశ్న అడుగుతున్న సమయంలో షో సమయం మించిపోవడంతో అక్కడితో ఆగిపోయినట్లు సమాచారం. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…