ఎవరు మీలో కోటీశ్వరులు.. ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న రియాల్టీ షో. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీనిలో సామాన్యలతో పాటు.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా గెస్ట్ గా వస్తున్నారు. ప్రస్తుతం ఈ షో ముగింపు దశకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ షోను మరింత స్పెషల్ గా మార్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఈ షోకు సంబంధించి అప్ డేట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి ఎంతో మంది సెలెబ్రిటీలు గెస్ట్ గా రాగా.. మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలిగెస్ట్ కూడా అతడే. ఆరోజు వాళ్లిద్దరు చేసిన సందడి మామూలుగా లేదు. వీరిద్దరి ఫ్యాన్స్ చూసి పండగ చేసుకున్నారు. అతడి తర్వాత సమంత, తమన్, దేవీ శ్రీ ప్రసాద్ లాంటి స్టార్స్ కూడా వచ్చారు.
కొరటాల శివ, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ షోలో కనిపించారు. ఇలా ఈ షో రేటింగ్ పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ షోకు మరో సూపర్ గెస్ట్ వచ్చాడు. ఆయనెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎన్టీఆర్ కు .. మహేశ్ బాబుకు మంచి స్నేహం ఉంది. ఆ సాద్న్నిహిత్యంతోనే అప్పట్లో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ వచ్చాడు. ఈ షోకు వచ్చిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్పై సెటైర్ల వర్షం కురిపించాడు మహేశ్ బాబు.
దీనికి సంబంధించి ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అయితే మహేశ్ బాబు ఈ షోలో ఎంత వరకు గెలుచుకున్నాడనే విషయం సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అతడు రూ.25 లక్షల వరకు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. అంటే 13 ప్రశ్నల వరకు కరెక్ట్ గా సమాధానలు చెప్పారు. రూ.50 లక్షల రూపాయల ప్రశ్న అడుగుతున్న సమయంలో షో సమయం మించిపోవడంతో అక్కడితో ఆగిపోయినట్లు సమాచారం. పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…