కరోనా తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఎంతో మంది సెలెబ్రిటీలకు ఆ వ్యాధి మళ్లీ సోకుతుంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అతడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.
అతడి ఊపిరితిత్తులకు 75 శాతం ఇనెఫెక్షన్ సోకడంతో అతడి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అతడి కుమారుడు అజయ్ కోరిన విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతే కాదు.. హీరో ధనుష్ కూడా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మాస్టర్ గురించి నటుడు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.
శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్ మాస్టర్ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తనతో తెలిపారని.. వాళ్లతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మాస్టర్ రెండో కుమారుడు అజయ్తోనూ ఫోన్లో మాట్లాడాను అని విష్ణు ట్వీట్ చేశారు.
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…