కరోనా తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఎంతో మంది సెలెబ్రిటీలకు ఆ వ్యాధి మళ్లీ సోకుతుంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అతడు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.
అతడి ఊపిరితిత్తులకు 75 శాతం ఇనెఫెక్షన్ సోకడంతో అతడి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అతడి కుమారుడు అజయ్ కోరిన విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతే కాదు.. హీరో ధనుష్ కూడా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మాస్టర్ గురించి నటుడు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.
శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్ మాస్టర్ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తనతో తెలిపారని.. వాళ్లతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మాస్టర్ రెండో కుమారుడు అజయ్తోనూ ఫోన్లో మాట్లాడాను అని విష్ణు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…