Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక గంటకు ఎంత సంపాదిస్తారో తెలుసా… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఈ పేరు తెలియని వారు ఉండరు. మన దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్న ఈయన ప్రపంచంలోనే టాప్ టెన్ ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నారు. రిలయన్స్ అధినేతగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ మన దేశంలోనే ధనవంతుడిగా పేరు సంపాదించిన ముఖేష్ అంబానీ ఒక రోజుకు ఎంత సంపాదిస్తారు, అతని ఆస్తిపాస్తుల గురించి ఇక్కడ తెలుసుకుందాం…
ముఖేష్ అంబానీ ప్రస్తుత 2022 వ సంవత్సరం వీరి ఆస్తి విలువ 9940 కోట్ల యుఎస్ డాలర్స్. మన దేశ కరెన్సీ ప్రకారం7.18 లక్షల కోట్ల రూపాయలు. వీరు ఒక రోజుకు 163 కోట్ల రూపాయలను సంపాదిస్తారు అంటే ప్రతి గంటకు 6 కోట్ల 79 లక్షల రూపాయలను సంపాదిస్తారు. ప్రతి నిమిషానికి 11 లక్షల 31 వేల రూపాయలను సంపాదిస్తారు. ఇలా ఈయన నిమిషానికి లక్షల్లో సంపాదిస్తూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ఇలా ఎంతో డబ్బు సంపాదించినప్పటికీ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. తన ఇంటిలో మొత్తం లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. ఇక ముంబైలో ఈయన ఇంటిలో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఉన్నాయి. ముకేష్ అంబాని తన ఇంటికి అంటిలీయా అనే పేరు పెట్టుకున్నారు. అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఒక దీవి పేరును వీళ్లు వీరి ఇంటికి పెట్టుకున్నారు. ఈ ఇంటిని నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంటి కోసం దాదాపు 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అన్ని సదుపాయాలతో నిర్మించుకున్నారు.
ఈ ఇంటినీ మెయింటెన్ చేయడం కోసం ఏకంగా ఆరు వందల మంది పనివాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ లక్షల్లో జీతాలు చెల్లిస్తారు. అంబానీ కారు డ్రైవర్ కి రెండు లక్షల రూపాయల జీతం చెల్లిస్తారు. ఇక వీరు ఇంటిలో కింది ఆరు ఫ్లోర్ లు కేవలం కార్ పార్కింగ్ కు మాత్రమే కేటాయించారు. ఏడవ ఫ్లోర్ లో కార్ సర్వీసింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడింది. వీరి ఇంట్లో 168 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇదే కాకుండా అన్ని సదుపాయాలతో కూడిన వ్యానిటీ బస్, మూడు ప్రైవేట్ జెట్ విమానాలు,అలాగే విలాసవంతమైన ఒక యాచ్ ఉంది. దీని ఖరీదు 600 కోట్లు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముఖేష్ అంబానీ ఇంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఇలా ఈయన తన ఇంటి నిర్మాణంలో కూడా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…