ప్రస్తుతం కరోనా సమయంలో ఫుడ్ డెలవరీలు బాగా పెరిగిపోయాయి. భయటకు వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి తమకు అంటుకుంటుందో అనే భయంతో ఇంట్లోనే ఉంటుంన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వరకు ఫుడ్ డెలివరీ యాప్ లు మితంగా ఉండేవి. కరోనా లాక్ డౌన్ దగ్గర నుంచి డెలివరీ యాప్ లు.. డెలివరీ చేసే బాయ్ లు కూడా ఎక్కువ అయ్యారు. అయితే యాప్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సమయంలో డబ్బులు పే చేసి ఆర్డర్ ఇస్తాం.
ఈ విధంగా డెలివరీ బాయ్ దానిని తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మనకు ఇష్టం ఉంటే టిప్ ఇస్తాం లేదంటే లేదు. ఇక్కడ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. పిజ్జాను అతడికి డెలివరీ చేస్తూ .. తనకు టిప్ ఇవ్వాలని కోరాడు.
డెలివరీ బాయ్ ఇలా టిప్పు అడగడంతో అతడు తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. అంతగా కావాలంటే పిజ్జాలోని ఓ ముక్క తీసుకోండంటూ చెప్పాడు. ఏంటి సార్.. జోక్ చేస్తున్నారా అంటూ డెలివరీ బాయ్ అతడిని అడిగాడు. దీంతో ఆ కస్టమర్ ఇలా అన్నాడు.. లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు.
ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్టాక్లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచి గొప్ప టిప్పు ఇచ్చావంటూ కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…