బుల్లితెరపై సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుడిగాలి సుదీర్ స్టేజ్ షోలను చేస్తూ జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యాడు.ఈ విధంగా జబర్దస్త్ లోకి ఎంటర్ అయిన సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమం ద్వారా వెనుతిరిగి చూసుకోలేదని చెప్పవచ్చు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఒక్కొక్కటిగా అవకాశాలను అంది పుచ్చుకుంటూ వెండితెరపై నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నారు అంటే ఏ స్థాయిలో అతని పర్ఫార్మెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉండటమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకు యాంకర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం యాక్టింగ్ పరంగా మాత్రమే కాకుండా క్రేజ్ పరంగా సుడిగాలి సుదీర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్, రష్మిక జంటకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మామూలుగానే వీరు ఒక్కొక్కరు స్టేజ్ పై ఉంటే చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి ఇద్దరు కలిస్తే ఇక ఆ షో కి వచ్చే రెస్పాన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇకపోతే సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా జాతిరత్నాలు ప్రియదర్శి వచ్చారు.
సుడిగాలి సుధీర్ కామెడీకీ, ప్రియదర్శి కామెడీ జోడయితే ఎలా ఉంటుందో ఈ ప్రోమోలో చూడొచ్చు. ఈ క్రమంలోనే ఈ షోకి వచ్చిన ప్రియదర్శిని సుడిగాలి సుదీర్ ఒక ప్రశ్న అడిగాడు.”నా చావు నేను చస్తా… నీకెందుకు అని ఒక పుస్తకం” రాశారు కదా.. దాన్ని పబ్లిష్ చేస్తున్నారా? అంటూ సుడిగాలి సుదీర్ ప్రియదర్శిని అడగడంతో.. అందుకు ప్రియదర్శి “నీకెందుకు బే.. హౌలే” అనేవాళ్ళు ఆ బుక్కును పబ్లిష్ చేస్తున్నారని అనడంతో సుడిగాలిసుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసమేనని తెలుసుకోవడంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…