బుల్లితెరపై సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుడిగాలి సుదీర్ స్టేజ్ షోలను చేస్తూ జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యాడు.ఈ విధంగా జబర్దస్త్ లోకి ఎంటర్ అయిన సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమం ద్వారా వెనుతిరిగి చూసుకోలేదని చెప్పవచ్చు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఒక్కొక్కటిగా అవకాశాలను అంది పుచ్చుకుంటూ వెండితెరపై నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నారు అంటే ఏ స్థాయిలో అతని పర్ఫార్మెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉండటమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకు యాంకర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం యాక్టింగ్ పరంగా మాత్రమే కాకుండా క్రేజ్ పరంగా సుడిగాలి సుదీర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్, రష్మిక జంటకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మామూలుగానే వీరు ఒక్కొక్కరు స్టేజ్ పై ఉంటే చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి ఇద్దరు కలిస్తే ఇక ఆ షో కి వచ్చే రెస్పాన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇకపోతే సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా జాతిరత్నాలు ప్రియదర్శి వచ్చారు.
సుడిగాలి సుధీర్ కామెడీకీ, ప్రియదర్శి కామెడీ జోడయితే ఎలా ఉంటుందో ఈ ప్రోమోలో చూడొచ్చు. ఈ క్రమంలోనే ఈ షోకి వచ్చిన ప్రియదర్శిని సుడిగాలి సుదీర్ ఒక ప్రశ్న అడిగాడు.”నా చావు నేను చస్తా… నీకెందుకు అని ఒక పుస్తకం” రాశారు కదా.. దాన్ని పబ్లిష్ చేస్తున్నారా? అంటూ సుడిగాలి సుదీర్ ప్రియదర్శిని అడగడంతో.. అందుకు ప్రియదర్శి “నీకెందుకు బే.. హౌలే” అనేవాళ్ళు ఆ బుక్కును పబ్లిష్ చేస్తున్నారని అనడంతో సుడిగాలిసుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసమేనని తెలుసుకోవడంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…