ప్రస్తుతం కరోనా సమయంలో ఫుడ్ డెలవరీలు బాగా పెరిగిపోయాయి. భయటకు వెళ్తే ఎక్కడ కరోనా మహమ్మారి తమకు అంటుకుంటుందో అనే భయంతో ఇంట్లోనే ఉంటుంన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వరకు ఫుడ్ డెలివరీ యాప్ లు మితంగా ఉండేవి. కరోనా లాక్ డౌన్ దగ్గర నుంచి డెలివరీ యాప్ లు.. డెలివరీ చేసే బాయ్ లు కూడా ఎక్కువ అయ్యారు. అయితే యాప్ లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చే సమయంలో డబ్బులు పే చేసి ఆర్డర్ ఇస్తాం.
ఈ విధంగా డెలివరీ బాయ్ దానిని తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మనకు ఇష్టం ఉంటే టిప్ ఇస్తాం లేదంటే లేదు. ఇక్కడ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. పిజ్జాను అతడికి డెలివరీ చేస్తూ .. తనకు టిప్ ఇవ్వాలని కోరాడు.
డెలివరీ బాయ్ ఇలా టిప్పు అడగడంతో అతడు తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. అంతగా కావాలంటే పిజ్జాలోని ఓ ముక్క తీసుకోండంటూ చెప్పాడు. ఏంటి సార్.. జోక్ చేస్తున్నారా అంటూ డెలివరీ బాయ్ అతడిని అడిగాడు. దీంతో ఆ కస్టమర్ ఇలా అన్నాడు.. లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు.
ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్టాక్లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచి గొప్ప టిప్పు ఇచ్చావంటూ కామెట్లు పెడుతున్నారు నెటిజన్లు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…