Surekha vani : అప్పటికి వరకు పెళ్లి ఊసే ఎత్తని కొందరు హీరోలు లాక్ డౌన్ సమయం లో అందరి పెళ్లిళ్లు చక చక జరిగిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్స్ అందరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారైయ్యారు. మరికొందరు రెండో వివాహం చేసుకొని అభిమానులకు అదిరిపోయే షాక్ ఇచ్చారు.
తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త ట్రెండీ అవుతుంది. అదేంటంటే తెలుగులో కొన్ని సినిమాలకు భార్య పాత్రల్లో మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటుందంటూ ఒక వార్త వచ్చింది. అయితే ఓ వెబ్సైటు లో ఆ వార్తని చూసిన సురేఖ వాణి అది నిజం కాదని ఫేక్ అని తెలిపింది. మరియు ఇదే వార్తపై సురేఖావాణి కూతురు సుప్రిత రియాక్ట్ అయ్యింది. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదు అని సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది.
సురేఖ వాణి ఈ వార్తతో మరో సారి ఫేమస్ అయ్యింది. సురేఖ వాణి అప్పుడపుడు తన కూతురు తో డాన్స్ చేసిన వీడియోలు, మరియు దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకునేది. ఆ ఫోటోలు వైరల్ అయ్యేవి. ఇప్పుడు మరోసారి సురేఖ వాణి విషయం రావడం మరో సారి నెట్ లో ట్రెండ్ అయ్యింది.
గత సంవత్సరం లో నిర్మాత దిల్ రాజు, మరియు సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే పనిగా సినిమా వాళ్లని టార్గెట్ చేసి వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళు ఏమి ప్రకటనలు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఒక పోస్టర్ ని సృష్టించి నెట్ లో వదులుతున్నారు. ఆ పోస్టర్ ని చూసిన వాళ్ళు అదే నిజం అనుకోని షేర్లు చేస్తున్నారు. ఆలా చేయడం మూలంగా అందులో ఉన్న వాళ్ళు దానిని చూసి ఇది నిజం కాదు అని చెప్పలేనంత వరకు సోషల్ మీడియా లో అదే నిజం అని నమ్మేస్తున్నారు. ఆ సదరు నటులు అది నిజం కాదు ఫేక్ అని చెప్తే అప్పుడు ఆ వార్తకి ముగింపు అనేది ఉంటుంది.
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…