Featured

ఏడుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఏదైనా విషాద ఘటన చోటు చేసుకున్న సమయంలో, మనం అనుకున్న అనుకున్న విధంగా జరగని సమయంలో మన కంటి నుంచి కన్నీళ్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సంతోషం కలిగించే వార్త విన్నా కంటి నుంచి ఆనంద భాష్పాలు కారతాయి. ఏడిస్తే మన మనస్సు కొంత తేలిక పడుతుంది. అయితే శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి ఏడుపు వల్ల కూడా అనేక లభాలు ఉన్నాయని, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

ఈ భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఏడుస్తూనే బయటకు వస్తాడు. పుట్టిన బిడ్డ ఏడవటం తన రాకను ప్రపంచానికి పరిచయం చేసే ప్రక్రియ. మనం కార్చే కన్నీళ్లలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి కళ్లను శుభ్రం చేసే కన్నీరు కాగా రెండోది కలక కన్నీరు మూడోది భావోద్వేగ కన్నీరు. మనం ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపించే సమయంలో భావోద్వేగ కన్నీళ్లు కంటి నుంచి వస్తాయి. ఈ కన్నీళ్లు మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ఏడుపు సహకరిస్తుందని యేలె యూనివర్సిటీకి చెందిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరైతే ఎక్కువ సమయం ఏడుస్తారో వారి శరీరం నుంచి ఎండోజెన్స్ ఒపియడ్స్, ఆక్సిటోసిన్ విడుదలవుతాయి. ఎవరైతే ఎక్కువ సమయం ఏడుస్తారో వారికి మనస్సు కుదుటపడి మానసిక ప్రశాంతత కలుగుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

ఒక సర్వే ఎవరైతే ఏడ్చి నిద్రపోతారో మంచి నిద్ర పట్టడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన కన్నీటిలో ఐసోజిమ్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండే ఈ ఎంజైమ్ కళ్లలోకి బ్యాక్టీరియా చేరకుండా రక్షిస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు ఏడుపు వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

48 minutes ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

1 hour ago

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

2 hours ago

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

13 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

13 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

14 hours ago