చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఆ దేశ ప్రభుత్వం భావించి గతంలో మాస్కులు సైతం వినియోగించాల్సిన అవసరం లేదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చైనాలోని కింగ్ డావో నగరంలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులు ఆ నగరంలోని ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
కింగ్ డావ్ లోని ఆసుపత్రి కరోనా వైరస్ కు క్లస్టర్ గా మారింది. ఆస్పత్రిలోని సీటీ రూంలో డిస్ ఇన్ ఫెక్షన్ సరిగ్గా చేయకపోవడంతో అక్కడ కోటి మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. చైనా ప్రభుత్వం ఇప్పటికే ఆ ఆస్పత్రి డీన్ ను తొలగించడంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. చైనా ప్రభుత్వం ఐదు రోజుల్లో కోటి మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి ఎంతమంది వైరస్ సోకిందో గుర్తించాలని పేర్కొంది.
ఇప్పటికే అక్కడ లక్షల సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏ ఒక్కరికీ వైరస్ నిర్ధారణ కాలేదు. కింగ్ డావో నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గతంలో బీజింగ్ లోని ఒక ఫుడ్ మార్కెట్ లో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో వేల సంఖ్యలో కరోనా పరీక్షలు జరిపి అధికారులు వైరస్ ను కట్టడి చేశారు. ప్రస్తుతం కింగ్ డావో నగరంలో కోటి మందికి కరోనా పరీక్షలు జరపడం ఆ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
మరోవైపు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ దేశంలో నిన్న ఒక్కరోజే 24 కొత్త కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చినట్టు వెల్లడించింది. అయితే ఈ కేసులన్నీ బయట దేశాల నుంచి వచ్చిన వారిలోనే గుర్తించామని చైనా హెల్త్ కమిషన్ చెబుతోంది. ఇప్పుడిప్పుడే వైరస్ తగ్గుముఖం పడుతోందని ఆనందించేలోపు మళ్లీ వైరస్ విజృంభిస్తోందని వస్తున్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…