Naresh: సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ఏదో విషయంలో వివాదాస్పదం అవుతున్నాడు. గతంలో కామెడీగా క్రేజ్ సంపాదించుకున్న నరేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ‘ మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు మద్దతు తెలుపుతూ… తెగ హంగామా చేశాడు నరేష్. మంచు ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి పెద్ద మోహన్ బాబే అంటూ.. తెగ హడావుడి చేశారు.
ఇదిలా ఉంటే మరోసారి నరేష్ పేరు తెరపైకి వచ్చింది. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి.. నరేష్, ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. ఆమె మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై నరేష్ స్పందిస్తూ.. రమ్యకు, తనకు ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. నరేష్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట్లో తల్లి విజయ నిర్మల చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు.
ఆ తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. మూడో పెళ్లిగా ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే వీరికి కూడా విడాకులు అయ్యాయని..
మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం రమ్యకు కూడా విడాకులు ఇచ్చాడని.. నెలనెల మెయింటనెన్స్ చెల్లిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…