Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!
Prabhas-Radhe Shyam: బాహుబలి, సాహో చిత్రాలతో ఆలిండియా స్టార్ గా మారిన ప్రభాస్.. తన కొత్త సినిమా రాధేశ్యాంతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న రాధేశ్యాంపై అన్ని ఇండస్ట్రీల్లో అంచానాలు తారాస్థాయికి చేరాయి.
ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్.. రాధేశ్యాం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా పాటలు ప్రస్తుతం ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. రాధేశ్యాంలో పూర్తి లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు.
తాజాగా రాధేశ్యాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు నిర్వహించనున్నారు. గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. దీని కోసం రామోజీ ఫిలీం సిటి అందంగా ముస్తాబవుతోంది. చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈసినిమా కోసం పీరియాడిక్ లుక్ వచ్చేలా సెట్ వేస్తున్నారు. దీనికి హోస్ట్ గా జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి వ్యవహరించనున్నట్లు సమాచారం.
జాతి రత్నాలతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. గతంలో జాతి రత్నాల ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. జాతి రత్నాలు సినిమా ప్రమోషన్లకు ప్రభాస్ కూడా హెల్ప్ అయ్యారు. దీంతో ప్యాన్ ఇండియా సినిమాకు జాతి రత్నాలు స్టార్ నవీన్ పోలిశెట్టి హోస్ట్ గా ఏమేర అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…