బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైన దగ్గర నుంచి వెనుకాల నుంచి గంభీరమైన వాయిస్ వినిపిస్తుంటుంది. అది అందరికీ తెలిసిందే. ఆ వాయిస్ ఎవరిదీ.. ఎవరు చెబుతున్నారు అనేది తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.
తాజాగా యాంకర్ రవి కూతురు వియా కూడా.. హౌస్ లోకి వెళ్లినప్పుడు బిగ్ బాస్ అంకుల్ ఒక్కసారి కనపడండి.. చూసి వెళ్తాను అంకుల్.. అంటూ క్యూట్ క్యూట్ మాటలతో చెప్పడం మనం చూశాం. ఆ ఆలోచన.. ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంది. బయట నుంచి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. తాజాగా మనం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే.. బిగ్ బాస్ అనే ఆ షో కి ఇంత క్రేజ్ రావడానికి ఈ గొంతు కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
అసలు ఈ బిగ్ బాస్ ఎవరు..? బిగ్ బాస్ అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా.. ఆ వ్యక్తి పేరు ‘రాధా కృష్ణ’. అతడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ షో ఇంత పాపులర్ అవ్వడానికి కారణం కూడా అతడి వాయిస్ అనే చెప్పాలి. మొదటి సీజన్ నుంచి కూడా రాధాకృష్ణనే బిగ్ బాస్ లాగా వాయిస్ ఇస్తున్నాడు. ఎవరైనా తన నటనతో.. ముఖాన్ని చూపించి పాపులర్ అవుతారు.. కానీ రాధాకృష్ణ మాత్రం వాయిస్ తోనే పాపులర్ అయ్యాడు.
బిగ్ బాస్ వాయిస్ చెప్పడం వల్ల ఆయనకి సినిమాల్లో కూడా బాగా అవకాశాలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షో కారణంగా తను ఎప్పుడూ చాలా సంతోషంగా ఉన్నానని దీనివల్ల తన కెరియర్ ఇప్పుడు విజయవంగాగా మారిందని అంటున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…