బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైన దగ్గర నుంచి వెనుకాల నుంచి గంభీరమైన వాయిస్ వినిపిస్తుంటుంది. అది అందరికీ తెలిసిందే. ఆ వాయిస్ ఎవరిదీ.. ఎవరు చెబుతున్నారు అనేది తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.
తాజాగా యాంకర్ రవి కూతురు వియా కూడా.. హౌస్ లోకి వెళ్లినప్పుడు బిగ్ బాస్ అంకుల్ ఒక్కసారి కనపడండి.. చూసి వెళ్తాను అంకుల్.. అంటూ క్యూట్ క్యూట్ మాటలతో చెప్పడం మనం చూశాం. ఆ ఆలోచన.. ఆశ ప్రతీ ఒక్కరికీ ఉంది. బయట నుంచి ప్రేక్షకులు కూడా అదే కోరుకున్నారు. తాజాగా మనం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే.. బిగ్ బాస్ అనే ఆ షో కి ఇంత క్రేజ్ రావడానికి ఈ గొంతు కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
అసలు ఈ బిగ్ బాస్ ఎవరు..? బిగ్ బాస్ అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా.. ఆ వ్యక్తి పేరు ‘రాధా కృష్ణ’. అతడు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ షో ఇంత పాపులర్ అవ్వడానికి కారణం కూడా అతడి వాయిస్ అనే చెప్పాలి. మొదటి సీజన్ నుంచి కూడా రాధాకృష్ణనే బిగ్ బాస్ లాగా వాయిస్ ఇస్తున్నాడు. ఎవరైనా తన నటనతో.. ముఖాన్ని చూపించి పాపులర్ అవుతారు.. కానీ రాధాకృష్ణ మాత్రం వాయిస్ తోనే పాపులర్ అయ్యాడు.
బిగ్ బాస్ వాయిస్ చెప్పడం వల్ల ఆయనకి సినిమాల్లో కూడా బాగా అవకాశాలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ షో కారణంగా తను ఎప్పుడూ చాలా సంతోషంగా ఉన్నానని దీనివల్ల తన కెరియర్ ఇప్పుడు విజయవంగాగా మారిందని అంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…