తెలంగాణలో డిసెంబర్ 2 నుంచి విద్యాసంస్థలు బంద్ అనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు . కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరిని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పాఠశాలలు బంద్ అనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అయితే దీనిని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి స్పందించారు.
ఈ ప్రచారంలో నిజం లేదని..అది అంతా ఫేక్ అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అయితే అలాంటి ప్రతిపాదన లేదని.. కోవిడ్ కేసులు నమోదవుతున్నా.. అవి సాధారణ కేసులే అని.. అవి ఒమిక్రాన్ వేరియంట్ కాదంటూ చెప్పారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యాసంస్థలు కొనసాగించాలిన ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గుర్తుచేశారు.
ఇలా విద్యాసంస్థలపై తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దవని ఆమె కోరారు. పిల్లల భద్రత, క్షేమం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి విద్యాంస్థల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా.. వైద్యుల సూచిస్తున్న నిబంధలను కచ్చితంంగా పాటించాలన్నారు. విద్యాసంస్థలపై వస్తున్న తప్పుడు కథనాలను, వార్తలను నమ్మొద్దంటూ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…