తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సినీ గేయరచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. అదే విధంగా ఒక అద్భుతమైన గాయకుడిగా ఎస్పీ బాలు ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఎన్నో అద్భుతమైన పాటలను బాలసుబ్రమణ్యం తన మధురమైన గానంతో ఆలపించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది వ్యవధిలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ లెజెండ్స్ ను కోల్పోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గత ఏడాది 2020 సెప్టెంబర్ 5వ తేదీ కరోనా మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న ఎంతోమంది తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించిన ఏడాదిలోగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం ఏర్పడింది. ఇలా సీతారామ శాస్త్రి కలం నుంచి విధాత తలపున…, అనాది జీవన వేదం ,గాలి, ఈ నీరు, ఈ ఊరు, సెలయేరు, ననుగన్న నా వాళ్ళు..పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు, రంగరిస్థివో, ఇలా బొమ్మ చేస్తివో అంటూ ఎన్నో అద్భుతమైన పాటలను అందించడం సిరివెన్నెల ఇకలేరు అనే విషయం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రస్తుతం ఈయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్ లో పలువురు అభిమానుల సందర్శనార్థం ఉంచారు.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. త్వరలోనే ఈయన అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…