ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరి వ్యక్తులను రాత్రి సమయంలో అతికిరాతంగా నరికి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక్కసారిగా సీమలో జంట హత్య కలకలం రేపింది.
స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందో తెలుసుకునే లోపే రెండు హత్యలు జరిగాయి. కర్నూలు జిల్లా సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. అయితే మల్లికార్జున్ దగ్గర గత కొన్నేళ్ల నుంచి ఓబులేసు అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
అతడు ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్లికార్జున రెండో భార్య చిన్నిని, ఓబులేసును ఎవరో దుండగులు అతికిరాతంకంగా హత్య చేసి పారిపోయారు. దీనికి సూత్రదారి మల్లికార్జున్ తండ్రే అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఈ హత్యలకు అక్రమ సంబంధం కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యలకు మల్లికార్జున్ తండ్రితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…