ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరి వ్యక్తులను రాత్రి సమయంలో అతికిరాతంగా నరికి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒక్కసారిగా సీమలో జంట హత్య కలకలం రేపింది.
స్థానికంగా ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందో తెలుసుకునే లోపే రెండు హత్యలు జరిగాయి. కర్నూలు జిల్లా సిద్దాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. అయితే మల్లికార్జున్ దగ్గర గత కొన్నేళ్ల నుంచి ఓబులేసు అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
అతడు ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్లికార్జున రెండో భార్య చిన్నిని, ఓబులేసును ఎవరో దుండగులు అతికిరాతంకంగా హత్య చేసి పారిపోయారు. దీనికి సూత్రదారి మల్లికార్జున్ తండ్రే అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఈ హత్యలకు అక్రమ సంబంధం కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ హత్యలకు మల్లికార్జున్ తండ్రితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…