బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మూడు వారాలు పూర్తి చేసుకోనుంది. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్ లు ఏ స్థాయిలో గొడవపడిన బిగ్ బాస్ వారి గురించి పట్టించుకోకుండా ఉన్నారు. అయితే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే నాగార్జున కంటెస్టెంట్స్ అందరిని దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా లహరి -రవి-ప్రియా మధ్య జరిగిన గొడవ పై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లహరి రవి అర్ధరాత్రి బాత్ రూమ్ దగ్గర హగ్ చేసుకున్నారన్న మాటలకు కంటెస్టెంట్ అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఈ విషయం గురించి వీరి ముగ్గురి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రియా అన్న మాటలు తమకు నచ్చలేదంటూ హౌస్ సభ్యులందరూ ఆమెను నామినేట్ చేశారు.
రవి ప్రియ దగ్గరికి వెళ్లి లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తోంది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాలే వస్తుంది.. తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ ప్రియా దగ్గర చెబుతాడు అదే మాటలను ప్రియా చెప్పగా లహరి రవి కోపంతో తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగుతారు. ఇదే విషయమే లహరి రవిని ప్రశ్నించగా నేను అలా అనడం లేదంటూ అబద్ధం చెప్పడంతో నెటిజన్లు రవి డబుల్ గేమ్ అడుగుతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా నాగార్జున వీరి ముగ్గురికి ప్రత్యేకంగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా హగ్ చేసుకోవడం అంటే బిజీగా ఉన్నట్టా అంటూ ప్రియను ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత రవిని నువ్వు సింగిల్ మెన్ అన్నావా? అని అనడంతో రవి అన్నాను సర్ అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నిజానిజాలేమిటో బిగ్ బాస్ లహరిని పవర్ రూమ్ కి పంపించి వీడియోలను ప్లే చేసి చూపిస్తాడు. ఈ క్రమంలోనే క్లారిటీ వచ్చింది కదా అంటూ లహరిని అడిగి ఎవరిది తప్పు లేదో బయటకు వెళ్లి వారిని హగ్ చేసుకో… మరి బయటకు వెళ్లిన లహరి ప్రియకు మద్దతు తెలుపుతుందా..?లేక రవికి మద్దతు తెలుపుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…