రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో డ్రోన్ చలనం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో జైలు పైభాగంలో డ్రోన్లు ఎగురుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు నిన్న రాత్రి ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో, సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రోన్లు ఎగురుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ప్రాధాన్యం పెరగడానికి కారణం, ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటమే. దీనితో, తమ నేతపై ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు డ్రోన్ ఎగరేసింది ఎవరు? దాని ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…