రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో డ్రోన్ చలనం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో జైలు పైభాగంలో డ్రోన్లు ఎగురుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు నిన్న రాత్రి ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.
ప్రాథమిక దర్యాప్తులో, సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రోన్లు ఎగురుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ప్రాధాన్యం పెరగడానికి కారణం, ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటమే. దీనితో, తమ నేతపై ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పోలీసులు డ్రోన్ ఎగరేసింది ఎవరు? దాని ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…