Editor Gowtham Raju : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు(68) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఈయన మంగళవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరువాత అర్ధరాత్రి ఆరోగ్యం క్షీనించడం తో తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ ఎడిటర్ గా పేరు సంపాదించుకున్న ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేసారు.
చట్టానికి కళ్లు లేవు సినిమాతో మొదలు పెట్టి…
గౌతమ్ రాజు ఇప్పటివరకూ దాదాపు 800 పైగా సినిమాలకు ఎడిటర్ గా చేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషా చిత్రాలకు కూడా ఈయన పని చేశారు. చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టి తన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఈయన గబ్బర్ సింగ్, రేసు గుర్రం, అదుర్స్, గోపాల గోపాల, ఖైదీ 150, బలుపు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలా తక్కువ మందిలో ఈయన ఒకరు. ఆది సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్ గా నంది అవార్డు అందుకున్నారు.
ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతినగర్ లోని తన నివాసానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…