Naresh & Pavithra Lokesh : పూటకో కొత్త మలుపు తిరుగుతూ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్న నరేష్, రమ్య, పవిత్ర లోకేష్ ల విషయంలో నరేష్, పవిత్ర లోకేష్ లు మాకు సపోర్ట్ చేయండి అంటుంటే, రమ్య ఒక వైపున తన భర్త కు విడాకులు ఇవ్వను అంటూ రచ్చచేస్తోంది. ఇక ఈవిషయంలో నరేష్ కి సపోర్ట్ చేస్తూ చిట్టీ బాబు, శ్రీనివాసులు నరేష్ చెల్లి ఓల్డ్ సినిమా యాక్టర్ పూజిత వంటి వారు రమ్య మీద ఆరోపణలతో బయలుదేరగా రమ్య మైసూర్ హోటల్ లో ఒకే గదిలో నరేష్, పవిత్ర లోకేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పవిత్రను చెప్పుతో కొట్టబోయి నానా రచ్చ చేసింది.
రమ్య ను కావాలనే రెచ్చగొడుతున్నారు…
ఇక సామాజిక వేత్త కృష్ణ కుమారి ఈ మ్యాటర్ పై స్పందిస్తూ నరేష్ పవిత్ర లోకేష్ ను వాడుకుని రమ్య ను రెచ్చగొడుతున్నానంటూ అభిప్రాయ పడ్డారు. పవిత్ర లోకేష్, నరేష్ ల విషయంలో ఇప్పుడు కాదు జనవరి నుండే వాళ్ళు బయట కనిపించడం, గుడులు తిరగడం మొదలుపెట్టారు. అలా రమ్యను రెచ్చగొట్టడం వారి ప్లాన్, రమ్యకు విడాకుల నోటీసు జనవరిలోనే నరేష్ పంపాడు. పబ్లిక్ లో నెగెటివ్ వస్తుందనే భయం నరేష్ కి లేదు, తన చుట్టూ ఒక కోట ఉంది. ఆయన చేస్తోంది తప్పు కాదు అని ప్రచారం చేయడానికి మనుషులు ఉన్నారు. అందుకే అంత ధైర్యంగా ఆయన ఈ ఇష్యూ లో ఉన్నారు. ఇక ఆయనకు ఎవరైనా మద్దతు ఇవ్వవచ్చు కానీ రమ్య కి మద్దతుగా ఎవరైనా ఉంటే మాత్రం వారితో ఆమెకు సంబంధం అంటగడుతున్నారు.
రమ్య బెంగళూరు లో మీడియా ముందు మాట్లాడటాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారు. ఆమె ఉండేది బెంగళూరులో కాబట్టి అక్కడ మాట్లాడింది, అలా అయితే మరి వెళ్లేందుకు ప్రెస్ మీట్లు హైదరాబాద్ లో పెడుతున్నారు, వీళ్ళు కూడా బెంగళూరు లో మాట్లాడొచ్చు కదా అంటూ కృష్ణ కుమారి ప్రశ్నించారు. సామరస్యంగా కూర్చొని వాళ్ళు చేసుకున్న ఆరోపణలకు సమాధానాలు వెతికితే పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఇలా రోడ్డుకేక్కితే ఎలా అంటూ కృష్ణ కుమారి కామెంట్స్ చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…