లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో ఇరుక్కుపోయి.. తమ రాష్ట్రాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారికోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-పాస్ లు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. అటువంటి వారు ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలంగాణ పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ-పాస్ వెబ్సైట్ (https://tsp.koopid.ai/epass) లోకి వెళ్లి ఈ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపారు. అప్లై చేసేముందు తగినంత సమాచారం ఎంటర్ చేసి అప్లై చేయాలని పోలీసులు చెబుతున్నారు. అలా వచ్చిన దరఖాస్తులు తాము పరిశీలించి అంతా సక్రమంగా ఉంటే.. ఈ పాస్ లు జారీ చేస్తామని తెలంగాణ డిజిపి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాస్ చాలా కీలకంగా మారింది. ఈ పాస్ లేకుండా సరిహద్దులు దాటే అవకాశాలు లేవు. మార్గ మధ్యలో గాని, చెక్ పోస్టుల్లో గాని పోలీసులు అడ్డుకుంటే ఈ పాస్ చూపిస్తే సరిపోతుంది. ఈ కారణంతో ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అందువల్ల ఈ వెబ్సైటు కు ట్రాఫిక్ ఎక్కువ రావడంతో ప్రస్తుతం స్ట్రక్ అయింది అని, ఇప్పటికే అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కొంత బ్రేక్ ఇస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి మళ్ళీ అప్లై చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…